Horrible Tragedy: నాలుక కోసి.. తల్లిని హతమార్చి..
కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది.
మద్యంమత్తులో తనయుడి ఘాతుకం
ఉప్పల రమణమ్మ(పాతచిత్రం)
రామభద్రపురం, న్యూస్టుడే: కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐలు సురేంద్రనాయుడు, జయంతి వివరాల మేరకు.. రామభద్రపురం గ్రామానికి చెందిన ఉప్పల రమణమ్మ(75) తన కుమారుడు శ్రీనుతో కలిసి ఉంటోంది. అవివాహితుడైన ఆయన టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసై.. ఇంటి ఖర్చులకు ఉంచిన డబ్బు, తల్లి పింఛను ను దుబారా చేస్తున్నాడు. గురువారం రాత్రి శ్రీను పూటుగా తాగి ఇంటికి వెళ్లడంతో రమణమ్మ మందలించింది. దీంతో సుత్తి తీసుకుని బలంగా తలపై కొట్టి, నాలుకను కోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ఎంతకీ వృద్ధురాలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పరిశీలించగా.. ఇంట్లో రక్తపుమడుగులో పడి ఉండటం గుర్తించారు. మృతురాలి కుమార్తెలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్ఛార్జి ఎస్ఐ జయంతి, ఏఎస్ఐ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరిగిన పైపులైన్లు.. తాగునీటి అవస్థలు
[ 17-05-2024]
మండలంలోని అంపావల్లి గ్రామంలోని తాగునీటి పైలెట్ ప్రాజెక్టు పరిధిలో పైపులైన్లు పగిలిపోతున్నాయి. -
సాగునీటి వనరులపై..చిన్నచూపేలా?
[ 17-05-2024]
జిల్లాలో సహజ వనరులకు లోటు లేదు. ఎక్కడికక్కడ నదులు.. వాగులు.. చెక్డ్యాంలు ఉన్నా.. పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. -
పురపాలిక నిధులతోనే అత్యవసర సేవలు
[ 17-05-2024]
అత్యవసర సేవలకు పురపాలిక నిధులే ఖర్చు చేస్తున్నామని మున్సిపల్ ప్రాంతీయ సంచాలకుడు నాగరాజు అన్నారు. మండలంలో గురువారం పర్యటించిన ఆయన తొలుత కమిషనర్ ఛాంబర్లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. -
పౌరాణిక పాత్రలు.. గాయనిగా పాటలు
[ 17-05-2024]
పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామానికి చెందిన పౌరాణిక కళాకారిణి కొప్పర మంగాదేవి(మంగమ్మ) ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. -
‘మిథ్యా’లయం!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. -
ఓటరు తీర్పుపై ఎవరి ధీమా వారిదే..!
[ 17-05-2024]
ఎన్నికల యుద్ధం ముగిసింది.. పోటీలో తొలి నుంచి అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదిలారు. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. -
పట్టణవాసిపై పన్ను బాదుడు
[ 17-05-2024]
చంద్రబాబు హయాంలో అద్దె ప్రాతిపదికన పన్నులు విధించేవారు. ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకునేవారు. నామమాత్రపు వార్షిక పన్ను వసూలు చేసేవారు. -
షట్టర్లు ఇలా.. నీరు పారేదెలా?
[ 17-05-2024]
సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారికంగా 38,500 ఎకరాల ఆయకట్టుకు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. -
ఆ విపత్తు నుంచి ఎంతో నేర్చుకున్నా
[ 17-05-2024]
‘ఏడాది పాటు ఎంతో నేర్చుకున్నా. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది’ అని జిల్లా సహాయక కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. -
అదనపు దూరం... తప్పని భారం
[ 17-05-2024]
పాలకొండ ఆర్టీసీ డిపో గతంలో రీజియన్లోనే ఆదాయంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కొన్ని ఏళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. -
డోలీలోనే గర్భిణి ప్రసవం
[ 17-05-2024]
గిరిజనులు అత్యవసర వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలో మరోసారి ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంకెప్పుడు వేస్తారో..?
[ 17-05-2024]
కురుపాం మండలం పొడి పంచాయతీ సంతోషపురం కూడలి నుంచి మీగడ గ్రామం వరకు రూ.1.90 కోట్ల ఉపాధి నిధులతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గత ఏడాది జులై 25న భూమిపూజ చేశారు. -
ఎఫ్సీఐ పేరిట బెదిరింపులు
[ 17-05-2024]
ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఆహార కల్తీ నియంత్రణ శాఖ) పేరిట ఓ హాటల్ యాజమాన్యాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై హరిబాబు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు