logo

Horrible Tragedy: నాలుక కోసి.. తల్లిని హతమార్చి..

కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది.

Updated : 16 Sep 2023 10:14 IST

మద్యంమత్తులో తనయుడి ఘాతుకం

ఉప్పల రమణమ్మ(పాతచిత్రం)

రామభద్రపురం, న్యూస్‌టుడే: కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐలు సురేంద్రనాయుడు, జయంతి వివరాల మేరకు.. రామభద్రపురం గ్రామానికి చెందిన ఉప్పల రమణమ్మ(75) తన కుమారుడు శ్రీనుతో కలిసి ఉంటోంది. అవివాహితుడైన ఆయన టిఫిన్‌ దుకాణాన్ని నడుపుతున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసై.. ఇంటి ఖర్చులకు ఉంచిన డబ్బు, తల్లి పింఛను ను దుబారా చేస్తున్నాడు. గురువారం రాత్రి శ్రీను పూటుగా తాగి ఇంటికి వెళ్లడంతో రమణమ్మ మందలించింది. దీంతో సుత్తి తీసుకుని బలంగా తలపై కొట్టి, నాలుకను కోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ఎంతకీ వృద్ధురాలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పరిశీలించగా.. ఇంట్లో రక్తపుమడుగులో పడి ఉండటం గుర్తించారు. మృతురాలి కుమార్తెలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ జయంతి, ఏఎస్‌ఐ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని