నీకు చేతులెలా వచ్చాయమ్మా?
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది.
వంతెన కింద చెత్తలో ఉన్న పసికందు మృతదేహం
అమ్మా.. వెచ్చని నీ పొత్తిళ్లే స్వర్గమనుకున్నానే.. ఈ చీకటి చీల్చుకుని.. నిన్ను చూసే క్షణానికై నిరీక్షించానే.. నీ ప్రేమ పొందేందుకే మరో జన్మ ఎత్తాననుకునే లోపే.. కడతేర్చావే అమ్మా.. నన్ను కనకూడదనుకున్నావా.. అసలు నీకు చేతులెలా వచ్చాయి..
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. పూర్తిగా నెలలు నిండకుండానే తల్లి దారుణంగా చెత్తలో పడేశారు. దీన్ని సోమవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ దేవి పరిశీలించి, మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. చిన్నారిని రెండు, మూడు రోజుల క్రితం పడేసినట్లు తెలుస్తోందని, కొన్ని భాగాలు పురిటి సంచిలోనే ఉన్నాయని ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్టుడే, మెంటాడ (గజపతినగరం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారులపై ధాన్యం ఆరబోస్తున్న రైతులు
[ 15-05-2024]
బలిజిపేట-బొబ్బిలి, బలిజిపేట, వంతరాం-రాజాం ప్రధాన రహదారులను కొంతమంది రైతులు పంట కళ్లాలుగా వినియోగిస్తున్నారు. -
చీకట్లోనూ పరిఢవిల్లిన ఓటుస్వామ్యం
[ 15-05-2024]
ఓటు వజ్రాయుధం..నిజమే.. మన తలరాతను మార్చేది.. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేది అవును.. ఈ మాటలు.. ఈ నినాదాలు.. ఓటర్లలో స్ఫూర్తిని రగిలించాయి.. అందుకే.. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో.. -
విజయస్ఫూర్తి
[ 15-05-2024]
విజయనగరం జిల్లాలో 15,62,921 మంది ఓటర్లకు ఏడు నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన పోలింగ్లో 12,71,173 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
2019.. 80.65 ఇప్పుడు 81.33
[ 15-05-2024]
జిల్లాలో ఓటింగ్ స్వల్పంగా పెరిగి రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అప్పటి ఓటర్ల సంఖ్యలో సగటు పోలింగ్ శాతం 80.65 జరగ్గా, ఈసారి ఏడు నియోజకవర్గాల్లో 15,62,921 మంది ఓటర్లలో 12,71,173 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 81.33 శాతం నమోదైంది. -
స్థలాల పేరిట గొప్పలు
[ 15-05-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అందరికీ స్థలాలు ఇచ్చామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. క్షేత్రస్థాయిలో మంజూరు చేసిన ఇళ్ల సంఖ్యలో స్థలాలు ఇచ్చింది సగం మంది లోపు. -
అమ్మ రూపం.. అపురూపం
[ 15-05-2024]
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
కొత్తవలస మండలం గొల్లలపాలేనికి చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. తెదేపా సానుభూతిపరుడైన కె.గంగాధర్ సోమవారం ఎన్నికల్లో 25 మందితో ఓట్లు వేయించారు. -
కాలువలో పడి ఓటర్లకు గాయాలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం కొత్తవలస మండలం వీరభద్రపురం పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పలువురు ఓటర్లు గాయపడ్డారు. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు పోలింగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. -
ఎన్నికల సిబ్బందికి తప్పిన ప్రమాదం
[ 15-05-2024]
ఎన్నికల అధికారులకు పాలకొండలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఉల్లిభద్రలో విధులు ముగించుకుని వస్తున్న సమయంలో మండల పరిధిలోని రాజుపేట కూడలిలో కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. -
రాయి పడి ఉపాధి కూలీ దుర్మరణం
[ 15-05-2024]
ఉపాధి పనులకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ మరణించిన ఘటన సీతంపేట మండలంలో జరిగింది. పోలీసులు, ఉపాధి సిబ్బంది వివరాల ప్రకారం.. బిల్లగూడకాలనీకి చెందిన సవర ఆదమ్మ(53)తో పాటు మరికొందరు మంగళవారం ఉపాధి పనికి వెళ్లారు. -
నిధుల్లేవు.. గౌరవమూ దక్కలేదు
[ 15-05-2024]
స్థానిక సంస్థలను జగన్ ప్రభుత్వం నిస్తేజంగా మార్చింది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను సొంతానికి వాడేసుకుంటోంది. విద్యుత్తు ఛార్జీలు, ఇతరత్రా బకాయిల కోసం నిధులను మళ్లించడంతో అభివృద్ధి పనులు చేసే అవకాశం లేకుండా పోవడంతో ప్రజాప్రతినిధులంతా ఈ ఐదేళ్లపాటూ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. -
ఖరీఫ్కు కష్టమే
[ 15-05-2024]
ప్రధాన సాగునీటి వనరు వట్టిగెడ్డ. దీని ద్వారా 17 వేల ఎకరాలకు నీరందాలి. ప్రస్తుతం జలాశయం ఎండిపోయి క్రీడా మైదానాన్ని తలపిస్తోంది. 399 అడుగుల వరకు నీటిమట్టం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం స్పిల్వే వద్ద కనిష్ఠ స్థాయికి చేరింది. -
నారీ.. స్ఫూర్తి
[ 15-05-2024]
జిల్లాలో మహిళా చైతన్యం ఓటెత్తింది. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే వీరే ఎక్కువ మంది కేంద్రాలకు తరలివచ్చి వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. 7,83,440 మంది ఓటర్లుండగా 4,00,779 మంది మహిళలున్నారు. -
రాత్రంతా జాగారం
[ 15-05-2024]
జిల్లాలో ఓటింగ్ తర్వాత గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల రిసెప్షన్ కేంద్రంలో ఈవీఎంలు అప్పగించాలి. నాలుగు నియోజకవర్గాల నుంచి ఒకేసారి రావడంతో సమస్యలు తలెత్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే