logo

సొమ్మసిల్లిన సంధ్యారాణి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మంగళవారం ఆమె మక్కువ మండలంలోని పెద ఊటగెడ్డ గ్రామంలో ప్రచారం చేపట్టారు.

Published : 01 May 2024 03:33 IST

విశ్రాంతి తీసుకుంటున్న సంధ్యారాణి

మక్కువ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మంగళవారం ఆమె మక్కువ మండలంలోని పెద ఊటగెడ్డ గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఎండ కారణంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన నాయకులు సమీపంలోని ఓ చెట్టు కిందకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె సాలూరులోని నివాసానికి వెళ్లిపోయారు. మండలాధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో కేండ్రుక గైశీల, పెదగైశీల గ్రామాల్లో ప్రచారం చేశారు. నాయకులు ఎం.ప్రసాదనాయుడు, బి.వాసుదేవరావు, సీహెచ్‌ తవిటినాయుడు, బి.గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని