పేదల ఆరోగ్యంతో చెలగాటం
పేదల ప్రభుత్వమంటూ పదే పదే చెబుతూ వచ్చిన వైకాపా సర్కారు వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అందించిన సేవలకు గాను ఆసుపత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో తరచూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.
పూర్తిస్థాయిలో బిల్లులివ్వని సర్కారు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: పేదల ప్రభుత్వమంటూ పదే పదే చెబుతూ వచ్చిన వైకాపా సర్కారు వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అందించిన సేవలకు గాను ఆసుపత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో తరచూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తాజాగా నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సేవలు అందించలేమని మంగళవారం చేతులెత్తేశాయి. అదేరోజు సాయంత్రానికి స్పందించిన ఉన్నతాధికారులు బకాయిల్లో కొంత విడుదల చేశారు. రూ.కోటి ఇవ్వాల్సిన వారికి రూ.10 లక్షలిచ్చారు. ఆ విధంగా గత రెండేళ్లలో ఇప్పటి వరకు రెండు విడతలు నామమాత్రంగా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం మూడో విడత కావడం గమనార్హం. ఈ తీరుపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
జిల్లాకు ఇవ్వాల్సింది రూ.50 కోట్లు...
జిల్లాలో 127 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. వీటన్నింటికి గడిచిన ఆగస్టు నుంచి బకాయిలు రావాల్సి ఉంది. రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు కొవిడ్ సమయంలో బిల్లులు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికైతే ఏకంగా రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము కింద రూ.5 కోట్లు రావాల్సి ఉంది. జిల్లాలో 9,53,701 మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులుండగా, 66,351 మంది ఈహెచ్ఎస్ సౌకర్యం ఉన్న ఉద్యోగులు, పింఛనుదారులున్నారు. వీరందరికీ ఓపి నుంచి మందులు వరకు నగదు రహిత వైద్యం అందించాల్సిందే. ఆసుపత్రులకు బిల్లులు సక్రమంగా రాకపోవడంతో సాధ్యమైనంత వరకు ఏదో సాకు చెప్పి వెనక్కి పంపుతున్నారు. ఎవరైనా సొంత డబ్బులు పెట్టుకుంటామని ముందుకొస్తే సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి సేవలు కొనసాగిస్తూ.. కొత్తవారికి అవకాశం లేదని కొన్నిచోట్ల వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన