ఓపిగ్గా నిలిచి... ప్రథమంగా నిలిపి
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటు. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలదే. ఈ విషయాన్ని జిల్లా ఓటర్లు గుర్తెరిగారు. ఎప్పుడూ బద్ధకంగా ఉండే పట్టణ, నగర ఓటరు కూడా ఈ సారి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఒంగోలులో బారులు తీరిన ఓటర్లు(పాత చిత్రం)
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటు. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలదే. ఈ విషయాన్ని జిల్లా ఓటర్లు గుర్తెరిగారు. ఎప్పుడూ బద్ధకంగా ఉండే పట్టణ, నగర ఓటరు కూడా ఈ సారి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తద్వారా ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక సమరంలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ సారి మహిళా ఓటర్లూ ఎక్కువ మందే తమ హక్కు వినియోగంలో ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల నిర్ణయంలో అతివలే కీలకం కాబోతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లూ భారీగానే పోలయ్యాయి. ఈవీఎంలు మొరాయించినా, ఎండలు సుర్రుమన్నా.. ఓటేసీ తీరాలన్న తపనతో వెనుదిరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ, విదేశాల్లో ఉంటున్నవారు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. తద్వారా గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం పెంచారు. జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలుండగా.. అందులో నాలుగో వంతు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.12 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాగిన సాధారణ ఎన్నికల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 2019 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో అత్యధికంగా నాగులుప్పలపాడు మండలంలో 5.84 శాతం ఓటింగ్ పెరగగా; ముండ్లమూరు, తాళ్ల్లూరు, పొన్నలూరు, కొండపి మండలాల్లో కొంత తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి