logo

వైకాపా దర్శి అభ్యర్థి ఎదుటే బాహాబాహీ

వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు.

Published : 02 May 2024 02:04 IST

ముండ్లమూరు, న్యూస్‌టుడే: వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు. అధికార పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎదుటే రెండు వర్గాలు ఘర్షణకు దిగడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివప్రసాద్‌రెడ్డి మండలంలోని మారెళ్ల పంచాయతీ గంగన్నపాలెం గ్రామానికి బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై మారెళ్ల గ్రామం నుంచి అక్కడికి వెళ్లారు. శివప్రసాద్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. ఈ సమయంలో గంగన్నపాలేనికి చెందిన పొతిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు మారెళ్ల గ్రామానికి చెందిన చైతన్యరెడ్డి, మరొకరిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో మారెళ్ల, గంగన్నపాలేనికి చెందినవారు సర్పంచి, ఎంపీపీ వర్గాలుగా విడివడి ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎదుటే బాహాబాహీకి దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి చేరుకున్నారు. చివరికి గ్రామస్థులు జోక్యం చేసుకుని మారెళ్ల సర్పంచి వర్గానికి సర్ది చెప్పి అక్కడ నుంచి స్వగ్రామానికి పంపించాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని