చంద్రన్న రాగానే ముస్లింలకు పింఛన్లు
మైనార్టీల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని, చంద్రబాబు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లు దాటిన ముస్లింలందరికీ పింఛన్లు అందిస్తారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ తెలిపారు.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: మైనార్టీల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని, చంద్రబాబు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లు దాటిన ముస్లింలందరికీ పింఛన్లు అందిస్తారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ తెలిపారు. ఒంగోలు నగరంలోని 4వ డివిజన్లో అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించి రాష్ట్రంలో ముస్లిం సోదరులకు జగన్ ద్రోహం చేశారని విమర్శించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తానని చెప్పి ఆ వర్గాన్ని మోసం చేశారన్నారు. తన పాదయాత్రలో వారికిచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారని విమర్శించారు. పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, 1991 నుంచి తమ కుటుంబం ప్రజాసేవలో ఉండి అనేక కార్యక్రమాలు చేస్తోందని, ఈ సారి ఎన్నికల్లో దీవించాలన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే చట్టసభల్లో పోరాడతామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, ముస్లింలకు ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే తనను దాటి రావాల్సి ఉంటుందన్నారు. వారికి ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు ఒరిగింది ఏమి లేదన్నారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు షేక్ కపిల్ బాషా, నాయకులు ఆఫీద్ మౌలానా, షేక్ అమ్రుల్లా, షేక్ అల్లాభక్షు పాల్గొన్నారు.
తెదేపాతోనే అభివృద్ధి, సంక్షేమ పాలన
కొత్తపట్నం, న్యూస్టుడే: తెదేపా సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కూటమి తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, రాజుపాలెం, గవండ్లపాలెం, కె.పల్లెపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రచారంలో వారు మాట్లాడారు. తెదేపాతోనే అభివృద్ధి, సంక్షేమ పాలన... యువతకు ఉపాధి అవకాశాలు సాధ్యమని పేర్కొన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, భాజపా నాయకుడు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?