logo

ధర్మపోరాటాన్ని విజయవంతం చేయండి

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ఇంతవరకు నెరవేర్చనందుకుగాను వచ్చే నెల 24న శ్రీకాకుళంలో నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు తూముల సూర్యారావు అన్నారు.

Published : 28 Jun 2022 06:32 IST

- న్యూస్‌టుడే, బూర్జ

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ఇంతవరకు నెరవేర్చనందుకుగాను వచ్చే నెల 24న శ్రీకాకుళంలో నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు తూముల సూర్యారావు అన్నారు. బూర్జ మండలంలో ఎంపీడీవో, తహసీల్దారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాల వద్ద సోమవారం ఈ మేరకు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి ఉద్యోగ, ఉపాధ్యాయ, తదితర సంఘాల నాయకులు, సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని