ఆధునికీకరణపైనే ఆశలు
పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద నెలకొన్న ఇబ్బందులతో నీటిలభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ప్రధానకాల్వ లోపంతో పక్కనే ఉన్న పంటపొలాలు సైతం బీళ్లుగా మారుతున్నాయి.
దుస్థితిలో పైడిగాం ప్రాజెక్టు
ప్రధానకాల్వ నిర్మాణ లోపంతో ఇబ్బందులు
న్యూస్టుడే, సోంపేట
ఆనకట్ట నిర్మించాల్సిన చీకటిగెడ్డ ప్రాంతం...
పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద నెలకొన్న ఇబ్బందులతో నీటిలభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ప్రధానకాల్వ లోపంతో పక్కనే ఉన్న పంటపొలాలు సైతం బీళ్లుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో పదివేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అధునికీకరించకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదముంది.
రూ.36 కోట్లతో ప్రతిపాదనలు: పైడిగాం అధునికీకరణకు రూ.36 కోట్ల అంచనావ్యయంతో ప్రతిపాదనలు పంపించారు. వీటికి అనుమతులు వస్తే జలవనరుల నిపుణుల కమిటీ పరిశీలించి కొత్త నిర్మాణాల విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహేంద్రతనయ నదిపై బాతుపురం ఎగువభాగంలో నిర్మించిన ఆనకట్ట తిత్లీ వరదకు కొట్టుకుపోయింది. ఆనకట్ట వద్ద నదిలో చిన్నకాల్వ ఏర్పాటు చేసి నీటిని ప్రధానకాల్వలోకి మళ్లించేందుకు అధికారులు చేపట్టిన చర్యలకు అక్రమ ఇసుక తవ్వకాలు అవరోధంగా మారాయి. నది లోతు పెరిగిపోయి 185 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 40 క్యూసెక్కులు కూడా చేరడంలేదు. రైతు నిపుణుల సూచనల మేరకు ప్రధానకాల్వ పరిధిలో 2.2 కి.మీ, లేదా 3.2 కి.మీ. వద్ద చీకటిగెడ్డ పరిధిలో ఆనకట్ట నిర్మిస్తే నీటిసరఫరా మెరుగుపడుతుంది. రెండు నియోజకవర్గాల పరిధిలో 10వేల ఎకరాలకు పైగా పంటభూములకు ఖరీఫ్, రబీల్లో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆనకట్ట నిర్మిస్తే ప్రధానకాల్వ 6 మీటర్ల వరకు లోతు పెంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తూర్పు కనుముల నుంచి వచ్చే వరదనీటిని నిల్వచేసేందుకు వీలుగా లెడ్డగుడ్డి వద్ద మినీ రిజర్వాయర్ నిర్మించి ప్రధానకాల్వతో అనుసంధానం చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
ఒడిశా చర్యలతో..: పురియాసాహి వద్ద ఒడిశా ప్రభుత్వం నదిపై 20 మీటర్లకు పైగా ఎత్తులో నిర్మించిన నిర్మాణాలతో ప్రాజెక్టు వద్దకు కనీస స్థాయిలో కూడా నీరు రావడం లేదు. వాటానీటి విడుదల విషయమై ఒడిశాతో పదిహేనేళ్ల కిందట పలుమార్లు అధికారులు, ఎంపీలు, మంత్రులస్థాయిలో సమావేశాలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి కూడా ఆ ప్రభుత్వానికి లేఖ రాసి కట్టడాల ఎత్తు తగ్గించాలని కోరినా స్పందన లేకుండా పోయింది. దీంతో ఒడిశాకు భారీగా వరదలు సంభవిస్తే తప్ప నదిలోకి అక్కడ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
అలా చేస్తేనే..: ప్రధానకాల్వ నిర్మాణంలో లోపం ఉంది. అప్పటి పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు. ఆనకట్టను చీకటిగెడ్డ లేదా 3.2 కి.మీ. వద్దకు మార్చి, హంసమేర వద్ద మినీ రిజర్వాయర్ నిర్మిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు. నాలుగు దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి.
బుద్దాన లోకనాథం, పైడిగాం ఆయకట్టు రైతు ప్రతినిది
నిపుణుల పరిశీలనతోనే..: రూ.36 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం. ఆనకట్ట మార్చాలన్నా, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నా జలవనరుల నిపుణుల పరిశీలనతోనే జరగాల్సి ఉంటుంది. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.
రమేష్, డీఈఈ, జలవనరులు
ప్రభుత్వం పరిశీలనలో ఉంది: పైడిగాం విషయమై ముఖ్యమంత్రి, జలవనరుల మంత్రితో కలిసి చర్చించాం. నిధుల మంజూరుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు అభివృద్ధికి తప్పకుండా చర్యలు చేపడతాం.
పిరియా విజయ, జడ్పీ అధ్యక్షురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?