చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
బూర్జ, న్యూస్టుడే : బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. వైకుంఠపురానికి చెందిన తమ్మినేని సింహాచలం పాలసేకరణ కేంద్రానికి సైకిల్పై వెళ్లాడు. కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ శ్రీకాకుళం నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉప్పినివలస వద్ద వాహనం అదుపుతప్పి సైకిల్ను ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. రమణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై జి.వి. ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సింహాచలం ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు.
వ్యక్తి బలవన్మరణం
కోటబొమ్మాళి, న్యూస్టుడే: మండలంలోని చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబ తగవుల నేపథ్యంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, పిల్లలు గ్రామంలో లేకపోవడంతో వారి రాక కోసం గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. కన్నేవలస వద్ద పెట్రోల్ బంకులో ఇటీవలి వరకు పనిచేసిన ఇతడు హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
పాత కక్షలతో కొట్లాట.. ఇద్దరికి గాయాలు
ఎచ్చెర్ల, న్యూస్టుడే: పాతకక్షల కారణంగా జరిగిన ఇద్దరు వ్యక్తులు గాయాలపాలైన ఘటన ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఓ కార్యక్రమం వద్ద పాతకక్షలున్న ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా మాట పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఘటలో కూన కిరణ్, కొత్తకోట వైకుంఠరావు తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వీరు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అల్లర్లు జరగకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి