logo

నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్‌

పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్‌ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మజ్జి త్రినాథ్‌ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 04:43 IST

ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి త్రినాథ బాబు

న్యూస్‌టుడే, పలాస: పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్‌ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మజ్జి త్రినాథ్‌ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. వేసవి తాపంతో అభిమానులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో హడావుడి లేకుండా వచ్చినట్లు చెప్పారు. అంతకు ముందు తెదేపా కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు చేయించారు. వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం సోదరులు ఆమెను ఆశీర్వదించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి త్రినాథ్‌ బాబు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ర్యాలీగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైద్యుడు దువ్వాడ జీవితేశ్వరరావు, మజ్జి బాబురావు, కొర్ల హేమారావు చౌదరి, సీతమ్మ, సీపీఐ నాయకులు వెంకరమణ, వేణుగోపాల్‌, సీపీఎం నాయకులు మోహనరావులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని