ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు.
ఆఫ్షోర్, వంశధార ప్రాజెక్టులను పట్టించుకోలేదు
న్యాయయాత్ర సభలో వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
కాంగ్రెస్ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణిని పరిచయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే టెక్కలి: వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. ‘దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఆఫ్షోర్ ప్రాజెక్టుకు సంబంధించి 50 శాతం పనులు పూర్తి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి తీశారా? వంశధార శివారు ఆయకట్టుకు నీరిస్తామన్నారు. వచ్చిందా? వంశధార కాలువల ఆధునికీకరణ చేస్తామని ప్రకటించి నిధులు ఇవ్వకుండా ఊరుకున్నారు. ప్రత్యేక హోదా వస్తే బిడ్డలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. పరిశ్రమలు ఏర్పాటవుతాయి. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణి, సీపీఎం నేత డి.గోవిందరావు, టంకాల గుప్తా, పొట్నూరు ఆనందరావు, కిల్లి రామ్మోహనరావు, విక్రాంత్, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, ఈశ్వరరావు పాల్గొన్నారు.
వైకాపాలో అవమానించారు..
కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్ని కాపాడుకోవడానికి..టెక్కలి ప్రాంత అభివృద్ధికి వైకాపాలో చేరితే అడుగడుగునా అవమానించారని.. అగౌరవపరిచారని కిల్లి కృపారాణి భావోద్వేగంతో చెప్పారు. టెక్కలిలో రహదారులు, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆలోచనతోనే జిల్లాకు విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, వంశధార రెండో దశ పనులు జరిగాయని తెలిపారు. నిశ్శబ్ద విప్లవంలా తమ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పరమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా సమస్యలకు నిలయంగా మారిందని, పాలకులు జీడి రైతుల సమస్యలు, ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకోలేదని విమర్శించారు. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్లో ఉన్నప్పుడే అభివృధ్ధి చేశారని, ఇప్పుడు ఏం జరగలేదని ఎద్దేవా చేశారు.
పలాస సభ రద్దు: టెక్కలిలో బహిరంగ సభ అనంతరం పలాస బయలుదేరిన వైఎస్ షర్మిల కాశీబుగ్గకు అనుకున్న సమయానికి కంటే రెండు గంటల ముందుగానే చేరుకున్నారు. సభా వేదిక వద్ద జనం అనుకున్న మేరకు రాలేదు. ముఖ్యమైన పని ఉందని ఆమె పలాస బహిరంగ సభను రద్దు చేసుకుని విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటికే వేచి చూస్తున్న జనం నిరాశతో వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన వనితోత్సాహం..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వచ్చారు. నేతల తలరాతలను నిర్ణయించడంలో వారి తీర్పే శాసనం కానుంది. పురుషుల కంటే వారి ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. -
గాలి కూటమి వైపే..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి దాటే వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ప్రక్రియ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
మార్టులన్నారు.. మాట మార్చారు..!
[ 15-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మండలానికో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తరువాత నియోజకవర్గానికి ఒకటేనని ప్రకటించింది. చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేసి ఊరుకుంది. -
తెదేపా కార్యకర్తపై దాడి
[ 15-05-2024]
మందస మండలం హరిపురంలో మంగళవారం తెదేపా కార్యకర్త కనగల రామారావుపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కర్ర అనిల్ దాడి చేశాడు. హరిపురంలోని 162 పోలింగ్ కేంద్రంలో రామారావు తెదేపా తరఫున ఏజెంటుగా ఉన్నారు. -
తెదేపాకు ఓటేశారని ఇంటికి తాళం
[ 15-05-2024]
తెదేపాకు ఓటేశారనే అక్కసుతో వైకాపా శ్రేణులు ఓ కుటుంబంపై కక్ష కట్టిన ఉదంతమిది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి చినబడాంకు చెందిన పి.మన్మధరావు భార్య సుజాతతో కలిసి ఓటు వేయడానికి విజయనగరం నుంచి వచ్చారు. -
తీర్పు భద్రం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్ల తీర్పును ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో మూడంచెల భద్రత నడుమ ఉంచారు. -
ముందే మేల్కొనకుంటే ముప్పే..!
[ 15-05-2024]
జాతీయ రహదారిలో లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో 2023 జూన్లో వ్యాన్ టైరు పేలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వస్త్రం
[ 15-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లు లావేరు మండలంలోని వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ తెలిపారు. -
పాము కాటుకు యువకుడి బలి
[ 15-05-2024]
మండలంలోని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన లఖినాన శివానందం (24) పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తల్లి పార్వతి, సోదరుడు పవన్ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి కట్ల పాము అతడిని కరిచింది. -
వైకాపా నేతలపై ఫిర్యాదు
[ 15-05-2024]
టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై తెదేపా బూత్ ఏజెంట్ రెయ్యి ప్రీతిష్ చంద్ర టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్