logo

పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం

వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Published : 05 May 2024 04:59 IST

మూలపేటలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సంతబొమ్మాళి మండలంలో ఆయన పర్యటించారు. బోరుభద్ర నుంచి మూలపేట వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.అనంతరం కె.లింగుడూ, విష్ణుచక్రం, ఎం.సున్నాపల్లి, మూలపేట, మరువాడ, సంధీపేట, లక్కివలస, మరువాడ, కొల్లిపాడు, గోదాలం గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రంలో పోర్టు కాంట్రాక్టు ఉందని చెప్పడం దోచుకోవడానికి నిదర్శనమని, గుత్తేదారు కోసం పోర్టు యాజమాన్యం పనిచేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తామన్నారు. ఓడిపోయే వైకాపాకు ఓటు వేస్తే వృథా అవుతుందని చెప్పారు. తెదేపా నాయకులు జీరు భీమారావు, నారంనాయుడు, స్వరూప్‌రెడ్డి, రెడ్డి అప్పన్న, అట్టాడ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని