వివాహిత ఆత్మహత్య
ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శ్రీదేవి సుష్మల్
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై వి.సత్యనారాయణ, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దాకుల వీధిలో ఉంటున్న రఘునాథ్, మాలతిల పెద్దకోడలు శ్రీదేవి. మేడ పైభాగాన ఆమె భర్త, ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. తరచూ నీళ్లకోసం అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ జరిగేది. ఆదివారం కూడా వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తన గదికి వెళ్లిన శ్రీదేవి క్షణికావేశంలో పంకాకు ఉరేసుకుని మృతిచెందింది. కొంత సమయం తరువాత కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూడగా, పంకాకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
యువకుడి బలవన్మరణం
సంతోష్కుమార్
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని ఏపీహెచ్బీ కాలనీకి చెందిన టేకి సంతోష్కుమార్ (28) అనారోగ్యంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్లుగా నరాల బలహీనతతో మానసికంగా బాధపడుతున్న యువకుడు 2021 నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లితో పాటు ఉంటున్న సంతోష్కుమార్ ఇంట్లో ఆమె బాత్రూంకు వెళ్లిన సమయంలో బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో సుమారు 65 ఏళ్ల వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఇచ్ఛాపురం రైలునిలయం దిగువమార్గంలో ఈ మృతదేహాన్ని ఆదివారం పలాస జీఆర్పీ పోలీసులు గుర్తించారు. 5.3 అడుగుల ఎత్తు, నీలం పొడుగుచేతుల చొక్కా, నీలం, నలుపు రంగుల లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ అధికారి షేక్ షరీఫ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.