నీరు గారిన పథకం
ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
న్యూస్టుడే, కవిటి గ్రామీణం, ఇచ్ఛాపురం
ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
కవిటి గ్రామీణం, న్యూస్టుడే: కవిటి మండలంలోని తాగునీటి వనరులు లేకపోవడంతో ఉద్దానం నీటి సరఫరా భాగంలో మండలంలోని 23 పంచాయతీల్లో 36 గ్రామాల్లో ఉద్దానం, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. అవి శిథిలమవుతున్నాయి. ముఖ్యంగా మండలంలో మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన ట్యాంకులు సముద్రం నుంచి వీచే ఉప్పుగాలి వలన త్వరగా పాడవుతున్నాయి.
ఉద్దానం నీటి సరఫరా పథకంలో భాగంగా జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో వీరి అవసరాలకు తగ్గట్టుగా గతంలో భారీ ట్యాంకులు నిర్మించారు. అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్యాంకు పైకి చేరుకునే సిమెంటు మెట్లన్నీ విరిగిపోయాయి. ఇనుముతో వేసిన మెట్లు తుప్పు పట్టి పోయాయి. కొన్నిట్యాంకుల స్తంభాలు బీటలు వారుతున్నాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఇందులో కొన్ని పథకాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారుతుండగా, వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిపై దృష్టి సారించి ట్యాంకులకు మరమ్మతులు చేయిస్తే మేలు జరుగుతుంది. శిథిలావస్థలో ఉన్న గ్రామాల్లోని ట్యాంకులు పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని నీటి వనరులు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: ఇచ్ఛాపురం మండల పరిధి బిర్లంగి గ్రామం మధ్యలో ఉన్న తాగు నీటి పథకానికి అమర్చిన ఇనుప నిచ్చెన శిథిలావస్థకు చేరుకుంది. 60 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంకు ప్రస్తుతం వినియోగంలోనే ఉంది. నిచ్చెన తుప్పు పట్టి విరగడంతో ఏ క్షణంలో కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.