చేనేత ఊపిరి తీసిన జగన్..!
సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు.
మగ్గం బతుకులపై పాలకుల కక్ష
నూలు, ఇతర రాయితీలకు మంగళం
న్యూస్టుడే, సోంపేట
సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు. నేతన్నలు వృత్తిని వదిలి భవన నిర్మాణ పనులు, రోజువారీ కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిచిపోవడం, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ప్రభుత్వ అవసరాల కోసం చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకపోవడం, చేనేతకు ప్రోత్సాహం అందించకపోవడం, నూలు రాయితీ చెల్లించకపోవడంతో కార్మికులు వలస బాట పట్టారు. సహకార సంఘాలు నిర్వీర్యమవడం, కామన్ ఫెసిలిటీ సెంటర్లు మూతపడటంతో జీవనోపాధికి అవస్థలు పడుతున్నారు.
ఊతమివ్వని కామన్ ఫెసిలిటీ సెంటర్లు
చేనేత కార్మికుల కోసం గత ప్రభుత్వం రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటీ సెంటర్లు నిరుపయోగంగా మారాయి. సోంపేట, బుడితి, తామరాపల్లి, నరసన్నపేట, తిలారు, అంపోలు, కొత్తపేట, పెనుబాక, కంచరాం, లావేరు, ఎఫ్బీపేట, కొప్పర, పొందూరు తదితర 19 ప్రాంతాల్లో ఒక్కో సెంటర్ కోసం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు చేసి నిర్మించారు. వస్త్రాల ఉత్పత్తి, మార్కెట్, సమావేశాలు, ఇతర అవసరాలకు ఉపయోగపడేలా వసతులు సమకూర్చారు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 20 వరకు మగ్గాలు ఏర్పాటు చేశారు. రాయితీపై నూలు ఇవ్వకపోవడం, ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడం, ప్రభుత్వ పరంగా వినియోగించే దుస్తులు, ఇతర వస్త్రాలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఈ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి.పని కల్పించకపోవడంతో నేత కార్మికులు సెంటర్ల వద్దకు రావడం లేదు. మగ్గాలకు చెదలు పడుతున్నాయి. కేంద్రాలు తెరుచుకోకపోవడంతో పరికరాలు దెబ్బతింటున్నాయి.
సొంత మగ్గం ఉంటేనే నేతన్ననేస్తం...
చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే నేతన్న నేస్తం సొంత మగ్గాలు ఉన్నవారికే పరిమితం చేసింది. మూడో వంతు కార్మికులకు మాత్రమే సాయం అందుతోంది. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి. ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సొంతంగా మగ్గం నేసే కార్మికులు తగ్గిపోయారు. నేతన్న నేస్తం లబ్ధి కొంతమందికే అందుతోంది. జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న నేతన్నలలో ఎక్కువ మంది మాస్టర్ వీవర్స్, వ్యాపారుల షెడ్ల వద్ద కూలీలుగా ఉన్నారు.
ప్రోత్సాహం కరవు
- కాశిన ప్రసాద్, చేనేత సంఘం ప్రతినిధి, అంపోలు
కామన్ ఫెసిలిటీ సెంటర్లు తెరవకపోవడం, రాయితీపై నూలు ఇవ్వకపోవడంతో చేనేత రంగానికి ప్రోత్సాహం కరవైంది. ఇంటి వద్ద ఒక మగ్గంపై పని చేయడానికి నలుగురైదుగురు కార్మికులు ఉండాల్సి ఉండగా ఒకరికే నేతన్న నేస్తం పథకం అందుతోంది. ఆరోగ్య బీమా సాయం నిలిచిపోయింది. త్రిఫ్ట్ ఫండ్ సాయం అందడం లేదు. సహకార సొసైటీలకు రాయితీ ఇవ్వకపోవడంతో చేనేత రంగం కుదేలైంది.
అందని రాయితీలు
- ఎం.కృష్ణారావు, జాతీయ చేనేత సలహా సంఘం మాజీ సభ్యుడు
గత ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల వరకు నూలు రాయితీపై అందజేసి వృత్తి పని చేసుకోడానికి ప్రోత్సాహం అందించింది. పింఛను, ఆదరణ పరికరాల పంపిణీ, ఆప్కో కొనుగోళ్లతో పరిశ్రమను నిలబెట్టింది. వైకాపా ఐదేళ్ల పాలనలో బీమా, ఇతర సాయం నిలిపివేశారు. చేనేతపై ఆధారపడి బతికే కుటుంబాలు వలస బాట పట్టాయి. భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలుగా మారారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.