కమ్యూనిస్టు యోధుడు శ్రీరాములు కన్నుమూత
మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు.
వజ్రపుకొత్తూరు, న్యూస్టుడే: మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు. యువజన, గిరిజన, కార్మిక, రైతు సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ వారి హక్కుల కోసం పోరాడారు. 90 సంవత్సరాల వయసులోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న నిబద్ధత ఆయనది. నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో అనేక ప్రజా సంఘాలు నిర్మించి ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఇటీవల జరిగిన జీడి రైతుల పోరాటం వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో స్ఫూర్తిదాయకంగా పని చేశారు.
ఆరేళ్లు అజ్ఞాత వాసం, రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ముగ్గురు కుమారులు కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. శ్రీరాములు భౌతికకాయంపై ప్రజా సంఘాల నాయకులు సీపీఎం జెండా కప్పి నివాళులర్పించారు. నేటి తరానికి ఆయన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు దువ్వాడ వెంకటకుమార్ చౌదరి, సన్యాసిరావు, మాధవరావు, మోహనరావు, త్రిలోచనరావు తదితరులు సంతాపం తెలిపారు. అంతిమ యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీడని గ్రహణం..!
[ 18-05-2024]
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న గంగాసాగరం జలాశయం పనులు ఐదేళ్లుగా ముందుకు కదలకపోవడంతో రైతులు సాగుకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. -
పోలీసు వలయంలో మూలపేట
[ 18-05-2024]
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిసర ప్రాంతాలు శుక్రవారం పోలీసుల ఆధీనంలోకి వెళ్లాయి. -
పారిశుద్ధ్య కార్మికుడి దారుణహత్య
[ 18-05-2024]
జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్న యువకుడి గొంతు కోసి హతమార్చిన ఘటన శ్రీకాకుళం నగరంలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది కలిపి 25,448 మంది ఉన్నారు. -
కట్టడం కుదరనప్పుడు ఎందుకు కూల్చేశారు..?
[ 18-05-2024]
అనువుగాని ప్రదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మైదానం నిర్మిస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మాయమాటలు చెప్పారు. -
పుట్టెడు శోకంలోనూ ఔదార్యం!
[ 18-05-2024]
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలోనూ ఔదార్యం చాటుకున్నారు. -
నత్తనడకన నీటి తీరువా పనులు
[ 18-05-2024]
వంశధార కాలువల పరిస్థితి రోజురోజుకీ అత్యంత దయనీయంగా మారుతోంది. దశాబ్దాల కాలంగా అవి నిర్వహణకు నోచుకోకపోవడంతో కునారిల్లుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన