logo

తెదేపాలో పలువురి చేరికలు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో బుధవారం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి

Published : 09 May 2024 04:10 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన సంతబొమ్మాళి, కోటబొమ్మాళి వైకాపా శ్రేణులు
కోటబొమ్మాళి, నరసన్నపేట, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో బుధవారం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి. సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ వరహాలమ్మపేట, సవరపేట, కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేట, కిష్టుపురం గ్రామస్థులు చేరారు. ః నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో తెదేపాలో చేరారు. కళ్లపల్లి రామారావు, గణేష్‌, అప్పారావు, రమణ, అసిరినాయుడు, సింహాచలం తదితర 15 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కరగాం, చెన్నాపురం, తదితర గ్రామాల నుంచి వంద కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని