logo

ఎన్‌ఈఆర్‌ ప్రచారంలో ఉద్రిక్తత..!

వైకాపా శ్రేణులు రోజురోజుకు ఉక్రోశాన్ని వెల్లగక్కుతున్నాయి. కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకపోతున్నాయి.

Published : 09 May 2024 04:40 IST

రథంపై రాళ్లదాడి, ముగ్గురికి గాయాలు

 గాయపడిన యువకుడు

 రణస్థలం, న్యూస్‌టుడే: వైకాపా శ్రేణులు రోజురోజుకు ఉక్రోశాన్ని వెల్లగక్కుతున్నాయి. కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారు. మొన్న వజ్రపుకొత్తూరు మండలంలో సాక్షాత్తు మంత్రి స్వగ్రామంలో దాడి జరిగింది. తాజాగా బుధవారం రాత్రి ఎన్‌జీఆర్‌పురంలో చోటు చేసుకుంది. కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు గ్రామంలో ప్రచారం చేస్తుండగా వైకాపాకు చెందిన కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న ఒక యువకుడితో పాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ప్రచారంపై ఉన్న ఎన్‌ఈఆర్‌ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

 ఓడిపోతామనే దాడులు..:‘ఎన్నికల్లో ఓడిపోతామనే భయపడి రాళ్ల దాడికి దిగుతున్నారు. వైకాపా వాళ్లకు ఓటు అడిగే దమ్ములేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఐదేళ్లలో ఒక గమేళా సిమెంట్‌ వేయలేకపోయారు. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. సిగ్గులేదా మీకు. ఇదేనా మీ బతుకు.’ అంటూ ఎన్‌ఈఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని