నెలకు రూ.4,000 పింఛను
తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు.
న్యూస్టుడే, సోంపేట, కవిటి గ్రామీణం, వజ్రపుకొత్తూరు, వజ్రపుకొత్తూరు గ్రామీణం, ఇచ్ఛాపురం, కంచిలి
గుణుపల్లిలో భారీ ర్యాలీగా వెళుతున్న గౌతు శిరీష
తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు పలు గ్రామాల్లో సూపర్-6 వల్ల ప్రయోజనాలను వివరించారు. పింఛను నెలకు రూ.4000, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి వాటి గురించి ప్రజలకు తెలిజేశారు.
వాలంటీర్ల చేరిక
కవిటి గ్రామీణం, పలాస, సోంపేట, న్యూస్టుడే: నెలవంక పంచాయతీ నుంచి గ్రామ వాలంటీరు మేఘనాథం, కొమ్ముపుట్టుగ గ్రామం నుంచి మాధవ్తోపాటు పలువురు తెదేపాలో చేరారు. దీంతోపాటు బెజ్జిపుట్టుగ పంచాయతీలోని బొగిడియాపుట్టుగ గ్రామం నుంచి 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
- పలాస తెదేపా కార్యాలయంలో పురుషోత్తపురానికి చెందిన వైకాపా నాయకుడు సప్ప.మన్మథరావు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న మందస మండలం బొగాబందకు చెందిన బి.శ్రీనివాస్రావు తెదేపాలో చేరారు.
సోంపేట : కొర్లాంలో తెదేపా ప్రచారం 206
- సోంపేట కళింగకోమటి సంఘం తెదేపాకు మద్దతు తెలిపింది. సోంపేటలో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రతినిధులు బి.గోవిందరాజులు, ఎల్.శ్రీను తదితరులు హాజరయ్యారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు.
సోదరి ఇదే మన గుర్తు
ఊరువాడా ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని కలిసి జరగబోయే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి ప్రచారం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు ఓటువేసే విధానంపై అవగాహన కలిగించారు.
న్యూస్టుడే, ఇచ్ఛాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల