ఇంటింటిపై జగన్ బాదుడు
శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు.
ఐదేళ్లలో భారీగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు
కట్టడి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలం
అదనపు భారంతో సామాన్య కుటుంబాల విలవిల
న్యూస్టుడే పాతశ్రీకాకుళం
శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల కిందట నెలవారీ సామగ్రికి రూ.4,500 ఖర్చు చేయగా ప్రస్తుతం రెట్టింపు అయింది. విద్య, వైద్యానికి చేస్తున్న వ్యయం అదనం. భవిష్యత్తు అవసరాలకు చేయాల్సిన పొదుపు గణనీయంగా తగ్గిపోయిందని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు.
సగటు జీవి కుదేలు
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలతో అరకొర ఆదాయంపై ఆధారపడే సగటు జీవి కుదేలవుతున్నాడు. చిరుద్యోగులు, కూలీలు, ఇతర రంగాలపై ఆధారపడిన వారి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. బియ్యం, వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇళ్లలోనే ఉంటున్నారు. వారికోసం చిరుతిళ్లు సిద్ధం చేయాలనుకున్నా ధరల భారంతో చాలామంది తల్లులు వెనకడుగు వేస్తున్నారు. సామాన్యుల కష్టాలు తెలిసినా జగనన్న మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించానని ప్రగల్భాలు పలుకుతున్నారు.
నియంత్రణ చర్యలు శూన్యం
గత ఐదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు రెట్టింపు కావడంతో సాధారణ, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లల్లో బడ్జెట్ తారుమారవుతోంది. కొనలేని..అలాగని తినకుండా ఉండలేని దుస్థితిని వారంతా ఎదుర్కొంటున్నారు. ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. సరకులు నల్లబజారుకు తరలకుండా పర్యవేక్షించడం, డిమాండ్ మేరకు పంటలు పండించేలా రైతుల్ని ప్రోత్సహించడం వంటి కార్యాచరణపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఎండీయూ వాహనాల ద్వారా పప్పులు, పంచదార, వంటనూనె వంటి సరకులను తక్కువ ధరలకు విక్రయించడం, రైతు బజారులను విస్తృతం చేయడం, పన్నులు తగ్గించడంపై శ్రద్ధ చూపలేదు. ఫలితంగా నెలవారీ ఖర్చులు పెరిగిపోయి ఆర్థికంగా భారమవడంతో సామాన్య ప్రజలు వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆదుకోని రేషన్
తెదేపా హయాంలో రేషన్ దుకాణాల్లో రూ.80కు రెండు కిలోల కందిపప్పు పంపిణీ చేశారు. గోధుమలు, పంచదార, వంటనూనె ప్యాకెట్లు నామమాత్ర ధరలకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం రెండు కిలోల కందిపప్పు రూ.124కు విక్రయించినా కొంతకాలానికే నిలిపివేసింది. పంచదార, వంటనూనె వంటి సరకులను ఇవ్వకుండా కావాలని ప్రజలపై అదనపు భారం మోపుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం వినియోగానికి తగినట్లు నాణË్యత ఉండటం లేదు. పంపిణీ సమయంలో కార్డుదారులు తీసుకుంటున్నా తరువాత విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యానికి రూ.50 నుంచి రూ.60 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
కాలం గడిపేసింది..: నిత్యావసర సరకుల ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే. పప్పుల నుంచి కూరగాయల వరకు అన్నీ భారంగా మారాయి. పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలు జీవనం సాగించడం కష్టమే. ధరలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వైకాపా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుండా ఐదేళ్లూ గడిపేసింది.
తమ్మన రమేష్, మహాలక్ష్మినగర్ కాలనీ, శ్రీకాకుళం
జిల్లాలో గడిచిన ఐదేళ్లలో నిత్యావసరాల ధరలు పెరిగిన తీరు ఇలా..(ధర కేజీకు.. రూ.ల్లో..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే