ఐటీడీఏను వెళ్లగొట్టారు..!
‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు.
గిరిజనులపై ప్రేమ ఇదేనా జగన్?
జిల్లాకు దూరంగా, ఆదివాసీలకు భారంగా..
న్యూస్టుడే, కొత్తూరు
‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సీతంపేటలో ఐటీడీఏ ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. సిక్కోలు పరిధిలోని గిరిజనులకు అక్కడి నుంచే సేవలందిస్తుండటంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు గల అవకాశాలను గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారని సమాచారం. విభాగాల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇతర అంశాలపై సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
అభివృద్ధికి నోచుకోని కొత్తూరు మండలంలోని గిరిజన గ్రామం అడ్డాయిగూడ
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 1.6 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే లక్ష వరకు ఉంటారు. 20 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉండగా జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు (టీపీఎంయూ) ఏడు ఉండగా.. ఇక్కడే ఐదు మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట, పార్వతీపురంలో ఐటీడీఏలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు విడిగా ఐటీడీఏ లేకపోవంతో గిరిజనులు నష్టపోతున్నారు. వైకాపా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో చూపిన చొరవ ఐటీడీఏ విషయంలో కొరవడిందని గిరిజనులు మండిపడుతున్నారు. జిల్లాకు సీతంపేట దూరంగా ఉండటం.. ఐటీడీఏ ఛైర్మన్గా వ్యవహరించే కలెక్టర్ చేయాల్సిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది.
జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న గిరిజనులు
పట్టించుకోని పాలకులు
జిల్లాలో ఇద్దరు మంత్రులు, సభాపతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ఐటీడీఏ ఏర్పాటు విషయమై పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గిరిజనులకు ఉపయోగపడేలా ఇక్కడ ఐటీడీఏ ఏర్పాటు చేసేలా కృషి చేయడంలో విఫలమయ్యారు. గిరిజన సంఘాలు ఉద్యమించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
కొరవడిన పర్యవేక్షణ
జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉన్నా.. ఐటీడీఏ మండలాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగం ఉంటుంది. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వెలుగు వంటి పథకాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించేవారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాలు, గురుకుల పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ తగ్గింది. ఐటీడీఏ ఉప ప్రణాళిక మండలాల్లో ఐటీడీఏ పీవో, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో స్థాయి అధికారులు నిత్యం వైద్యంపై సమీక్షించేవారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రత్యేకంగా ఈఈ, డీఈఈ, ఏఈలు పర్యవేక్షణలో జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఉన్నతాధికారులకు నివేదించాం..
- రోషిరెడ్డి, ఏపీవో, ఐటీడీఏ, సీతంపేట
శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. గిరిజన ప్రజల నుంచి వచ్చిన వినతులపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆరా తీశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
తక్షణ చర్యలు అవసరం
సవర సురేష్, ఆదివాసీ సంఘ జిల్లా నాయకుడు, దొండమానుగూడ
జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు తక్షణం చర్యలు చేపట్టాలి. 16 మండలాలున్న మన్యం జిల్లాకు రెండు ఐటీడీఏలు ఉన్నాయి. 30 మండలాలున్న శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ఈ విషయమై వైకాపా పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చి గ్రామాల్లో తిరగాలి. లేకుంటే గిరిజనుల ఆగ్రహానికి గురవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే