logo

సీఎంతో నిర్వాహకుల భేటీ

డీఎంకేలోని పలు విభాగాలకు నియమితులైన నిర్వాహకులు ఆ పార్టీ అధ్యక్షుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

Published : 28 Nov 2022 01:18 IST

స్టాలిన్‌ను కలిసిన మహిళా విభాగ ప్రతినిధులు

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకేలోని పలు విభాగాలకు నియమితులైన నిర్వాహకులు ఆ పార్టీ అధ్యక్షుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యారు. డీఎంకేలో పలు విభాగాలకు రాష్ట్రస్థాయి నిర్వాహకులను పార్టీ అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా, విద్యార్థి, కార్యకర్తల విభాగం నిర్వాహకులు పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను తేనాంపేటలోని అన్నా అరివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, ఉప ప్రధానకార్యదర్శి, ఎంపీ కనిమొళి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.భారతి, అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని