logo

‘తొక్కిసలాట’ మృతులకు అంత్యక్రియలు

వానియంబాడి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో చిక్కుకొని మృతి చెందిన నలుగురికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Published : 06 Feb 2023 00:49 IST

నివాళులు అర్పిస్తున్న జోలార్‌పేట ఎమ్మెల్యే దేవరాజ్‌

వేలూర్‌, న్యూస్‌టుడే: వానియంబాడి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో చిక్కుకొని మృతి చెందిన నలుగురికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపత్తూర్‌ జిల్లా వానియంబాడిలో తైపూస ఉత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జిన్నా వంతెన సమీపంలో ప్రైవేటు సంస్థ తరఫున ఉచిత చీరెలు, ధోవతుల పంపిణీకి టోకెన్లు అందజేశారు. అప్పుడు తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. ఆదివారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. జోలార్‌పేట డీఎంకే ఎమ్మెల్యే దేవరాజ్‌ వారికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు తలా రూ. 25 వేలను అందజేశారు. అనంతరం వారి స్వస్థలాల్లో మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని