ప్రాణస్నేహితుల్లా మెలిగాం
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
గణేశమూర్తి మృతిపై వైగో కంటతడి
విలేకరులతో మాట్లాడుతున్న వైగో
విల్లివాక్కం, న్యూస్టుడే: డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్లుగా ఇద్దరం ప్రాణస్నేహితుల్లా మెలిగామని వైగో చెప్పారు. ఇద్దరి లక్ష్యాలు ఒకటేనన్నారు. గణేశమూర్తి కొద్దిరోజులుగా మనోవేదనలో ఉన్నట్లు ఈరోడ్ జిల్లా పార్టీ నిర్వాహకులు తనతో చెప్పారన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇచ్చి రెండుసీట్లు కేటాయించేలా పరిశీలించాలని గణేశమూర్తి కూడా కోరినట్లు గుర్తుచేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో దిగ్భ్రాంతి చెందానని కంటతడి పెట్టుకున్నారు. ఆయన బలవన్మరణానికి ఎంపీ సీటు ఇవ్వకపోవడం కారణం కాదని చెప్పారు. అనంతరం గణేశమూర్తి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. మృతదేహాన్ని ఈరోడ్లోని పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణేశమూర్తి స్వగ్రామం కుమరవలసులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పలువురి సంతాపం..
చెన్నై, న్యూస్టుడే: ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి తన సంతాప ప్రకటనలో... గణేశమూర్తి మృతివార్త దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించిందని తెలిపారు. రాజకీయ ప్రస్థానాన్ని డీఎంకేలో ప్రారంభించిన ఆయన తర్వాత వైగోతో కలిసి ప్రయాణించారని పేర్కొన్నారు. ఎండీఎంకే కార్యకర్తలు, ద్రావిడ ఉద్యమ సానుభూతిపరులకు, గణేశమూర్తి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఎన్సీసీ అధ్యక్షుడు సెలపెరుంతగై తన ప్రకటనలో.. ఎండీఎంకే ప్రారంభించినప్పటి నుంచి వైగోకు యుద్ధ దళాధిపతి తరహాలో గణేశమూర్తి వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఈరోడు అభివృద్ధికి అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.