మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది.
ఆర్కేనగర్, న్యూస్టుడే: తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. మద్యానికి బానిసైన బాలసుబ్రమణ్యం పనికి వెళ్ల్లకుండ తరచూ తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు లేవనే కోపంతో తన కుమార్తె చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చి వీడియో తీసి విదేశాల్లో ఉన్న భార్యకు పంపి డబ్బులు అడిగాడు. వీడియోని చూసిన తల్లి శివరంజని తల్లడిల్లిపోయింది. వెంటనే అధిరపట్టినంలోని తనకు తెలిసిన సామాజికవేత్తకు సమాచారం ఇచ్చింది. అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని కాపాడి, బాలసుబ్రమణ్యాన్ని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఏటీఎంలో నగదు చోరీ
ప్యారిస్, న్యూస్టుడే: చెన్నై పల్లావరం జీఎస్టీ సాలైలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం మీనంబాక్కం విమానాశ్రయం ఎదురుగా ఉంది. ఈ క్రమంలో బుధవారం ఏటీఎంలో నగదు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. ఏటీఎంలో కొంత నగదు ఉన్నట్లు వారి వద్ద సమాచారం ఉంది. కాని అక్కడికి వెళ్లిచూస్తే ఏటీఎం యంత్రంలో నగదు లేదు. దీంతో వారు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారులు వెళ్లి పరిశీలించగా ఏటీఎం సీక్రెట్ కోడ్ నెంబరు ఉపయోగించి రూ.100 తీసుకుంటే రూ.500 వచ్చేలా సెట్టింగ్ మార్చినట్లు గమనించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు సెట్టింగ్ మార్చి నగదు చోరీచేసినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ చేయడానికొచ్చి నిద్రపోయిన దొంగ
ప్యారిస్, న్యూస్టుడే: తక్కలైకి చెందిన మోహన్దాస్ కొన్ని రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో పాటు తూత్తుక్కుడిలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు భార్యతో కలిసి సొంతూరికి వచ్చాడు. అప్పుడు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. లోపలికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. అనంతరం స్థానికుల సాయంతో దుండగుడిని పట్టుకుని పోలీసులకి అప్పగించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా అతను తిరునెల్వేలికి చెందిన శివశంకర్ అని తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు యజమానులకూ కష్టాలు..
[ 01-05-2024]
కారున్నవారికి సమస్యలుండవా.. అంటే చాలానే అన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలతో ముప్పతిప్పలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి దాపురించింది. చెన్నైలో తాజాగా నిర్వహించిన సర్వేలో కార్ల యజమానులు ప్రత్యేక డిమాండ్లను ముందుంచారు. -
సముద్రంలో జాలర్లపై దాడి
[ 01-05-2024]
సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది. -
మళ్లీ మోదీయే ప్రధాని: ఓపీఎస్
[ 01-05-2024]
మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని మాజీ సీఎం పన్నీర్సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్ అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులను నియమించి ప్రత్యేకవర్గంగా పని చేస్తున్నారు. -
ఐలాండ్ మైదానానికి బ్రాడ్వే బస్టాండ్
[ 01-05-2024]
చెన్నై బ్రాడ్వే బస్టాండ్ను తాత్కాలికంగా ఐలాండ్ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్గా ఉండేది. -
తాగునీటికి రాస్తారోకో
[ 01-05-2024]
కోవై జిల్లా మేట్టుపాళ్యం సమీప ఆలంగుడి గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సరఫరా ఆగిపోయింది. అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో శిరుముగై- సత్తి మార్గంలో రాస్తారోకోకు దిగారు. -
మెట్రో ప్రయాణికులకు ఎన్సీఎంసీ కార్డులు
[ 01-05-2024]
చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) కల్పిస్తోంది. -
కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ఫ్లూ
[ 01-05-2024]
కేరళలో బర్డ్ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
తుదిదశలో వణంగాన్ చిత్రీకరణ
[ 01-05-2024]
బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వణంగాన్’. మమితా బైజు, రోషిని ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ఇతర నటీనటులు. -
జారవిడుచుకున్న ఏటీఎం కార్డులే లక్ష్యం
[ 01-05-2024]
ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. -
ఏర్కాడులో బస్సు బోల్తా
[ 01-05-2024]
సేలం జిల్లాలోని పర్యాటక ప్రదేశమైన ఏర్కాడు కొండ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి