మెట్రో ప్రయాణికులకు ఎన్సీఎంసీ కార్డులు
చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) కల్పిస్తోంది.
కొత్తగా వచ్చేవారికి ‘స్మార్ట్ కార్డు’ల నిలిపివేత
సీఎంఆర్ఎల్ నిర్ణయం
న్యూస్టుడే, వడపళని
ఎన్సీఎంసీ కార్డు
చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) కల్పిస్తోంది. అందులో భాగంగా స్మార్ట్ లేదా ట్రావెల్ కార్డు, క్యూఆర్ కోడ్ విధానం, యాప్, పేటీఎం, ఫోన్పే వంటివి అందుబాటులోకి తెచ్చింది. అన్ని విధాలైన రవాణా, ఇతరత్రాలకు వీలుగా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (ఎన్సీఎంసీ)ని బాగా ప్రాచుర్యంలోకి తేవాలనే ఉద్దేశంతో తాజాగా స్మార్ట్ కార్డులకు స్వస్తి పలికింది. అయితే ఇప్పటికే స్మార్ట్ కార్డులున్న వారు రీఛార్జ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఇకపై కొత్తగా ఇచ్చే వారికి జారీ చేయరు.
అధికంగా వినియోగం
‘ఎన్సీఎంసీ’ కార్డు ప్రయాణికులకు అన్ని రకాల రవాణాలకు వీలుగా ఉంటుందని కొత్తగా వచ్చేవారికి ఆ కార్డులనే అందజేయనున్నట్టు సీఎంఆర్ఎల్ పేర్కొంది. నగరంలో తొమ్మిదేళ్ల క్రితం మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో స్మార్ట్ కార్డులు, టోకెన్ల విధానంతో ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేసే వీలు కల్పించారు. ఈ రోజుకీ అనేక మంది ఆ విధానాన్ని అవలంబిస్తూనే ఉన్నారు. మార్చిలో ప్రయాణాలు సాగించిన 86.82 లక్షల మందిలో 37.64 లక్షల మంది స్మార్ట్ కార్డులు వినియోగించుకున్నారని సీఎంఆర్ఎల్ డేటాలో తెలుస్తోంది.
అవీ కొనసాగించాలి
గత ఏడాది ఏప్రిల్లో ఎన్సీఎంసీ కార్డులను ప్రవేశపెట్టడంతో అదే ఏడాది నవంబరు నుంచి స్మార్ట్ కార్డుల అందజేత నిలిపేసినట్లు సీఎంఆర్ఎల్ అధికారి ఒకరన్నారు. స్మార్ట్ కార్డుతో కలిగే ప్రయోజనాలు ఎన్సీఎంసీ కార్డులో కూడా ఉంటాయని, ప్రయాణాలకు మాత్రమే కాకుండా దుకాణాలు, ఇతర రవాణా సదుపాయాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. అయితే స్మార్ట్ కార్డుల అందజేత ఆపేయకుండా కొనసాగిస్తే బాగుంటుందని కొందరు పేర్కొంటున్నారు. ఎన్సీఎంసీ కార్డుకు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని, అదే స్మార్ట్ కార్డుకయితే అవసరం లేదని తెలుపుతున్నారు. గుర్తింపు కార్డు చూపించే సమయం ప్రయాణికుల్లో చాలా మందికి ఉండదన్నారు. వృద్ధులకు స్మార్ట్ కార్డు రీఛార్జ్ చేసుకోవడానికి, టిక్కెట్లు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరియార్నగర్ ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వసతులు
[ 22-05-2024]
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ నియోజకవర్గమైన కొళత్తూరు పెరియార్నగర్లో ప్రజా పనులశాఖ ఆధ్వర్యంలో అధునాతన సదుపాయాలతో ప్రభుత్వ పెరిఫెరల్ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. -
తిరుప్పూర్లో భారీవర్షాలు
[ 22-05-2024]
తిరుప్పూర్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల కిందట 364.50 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలు గ్రామాల్లో కాలువలు, చెరువులు నిండి పొంగుతున్నాయి. -
విదేశీ విమాన సర్వీసుల కొరత
[ 22-05-2024]
బెంగళూరు విమానాశ్రయం కన్నా చెన్నై విమానాశ్రయం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య ఎక్కువ. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణకొరియా వంటి ప్రాంతాలకు ప్రయాణికుల తాకిడి కూడా బాగానే ఉంది. -
హీరోగా నటించడానికి సంశయించిన సూరి
[ 22-05-2024]
హీరోగా నటించడానికి మొదట్లో సూరి సంశయించాడని నటుడు శివకార్తికేయన్ తెలిపారు. దర్శకుడు వెట్రిమారన్ కథ రాసి, దురై సెంథిల్ దర్శకత్వం వహించిన ‘గరుడన్’ 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ‘అపోలో’
[ 22-05-2024]
మానవ మెదడులో వైద్య పరిభాషలో వ్యవహరించే ‘డీప్లీ సీటెడ్ ఇన్సులేటర్ బ్రెయిన్ ట్యూమర్’కు అపోలో క్యాన్సర్ సెంటర్స్(ఏసీసీ) న్యూరో సర్జన్ల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. -
తండ్రిని హత్య చేసిన తనయుడు
[ 22-05-2024]
పూందమల్లి సమీప తిరుమళిసైకి చెందిన బాబు (49) తాపీ మేస్త్రి. ఇతనికి భార్య దేవి, కుమారుడు తమిళరసన్ ఉన్నారు. -
ప్లస్ టూ చదివే కుమార్తె సాయంతో విద్యార్థినులతో వ్యభిచారం
[ 22-05-2024]
ప్లస్ టూ చదివే కుమార్తె సాయంతో పాఠశాల విద్యార్థినులతో వ్యభిచారం చేయించిన మహిళా దళారీ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయించిన ఘటన కలకలం సృష్టించింది. -
ఐదు రోజుల్లో 11 మంది మృతి
[ 22-05-2024]
భారీవర్షాలకు ఐదు రోజుల్లో 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వేసవిలో సాధారణంగా 12.5 సెం.మీ వర్షపాతం నమోదు అవుతుంది.