జారవిడుచుకున్న ఏటీఎం కార్డులే లక్ష్యం
ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
లక్షల్లో నగదు కాజేసిన నిందితుడి అరెస్టు
నిందితుడు శ్రీనివాసరెడ్డి
ప్యారిస్, న్యూస్టుడే: ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను గత మార్చి 31న తన ఏటీఎం కార్డుని జారవిడుచుకున్నట్లు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అదేరోజు తన బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతలుగా రూ.12 వేలు విత్డ్రా అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న చూళైమేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఏటీఎం కేంద్రం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన తల్లా శ్రీనివాసరెడ్డి అని, ఇంజినీరింగ్ చదివి గతంలో బ్యాంకులో ఉద్యోగం చేశాడని తెలిసింది. బ్యాంకులో పనిచేసే సమయంలో డెబిట్ కార్డుని ఏ విధంగా ఉపయోగించాలి, నగదు ఏవిధంగా తీయాలి మొదలైన సాంకేతిక మెలకువలు తెలుసుకున్నాడని, అనంతరం బ్యాంకు ఉద్యోగం మానేసి, డెబిట్ కార్డులు చోరీ చేయడం ప్రారంభించాడని, అదేవిధంగా ప్రజలు జారవిడుచుకునే కార్డులను ఉపయోగించి స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు విత్డ్రా చేసేవాడని తెలిసింది. ఇలా కాజేసిన నగదుతో ఉన్నతంగా బతుకుతున్నాడు. ఇలా చెన్నై, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతని నుంచి 63 ఏటీఎం కార్డులు, స్వైపింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై హైదరాబాద్లో 11 కేసులు పెండింగ్లో ఉన్నట్లు దరాప్తులో తెలిసింది.
బాలికపై హత్యాచార వ్యవహారం
600 పేజీల అభియోగపత్రం సిద్ధం
ఆర్కేనగర్, న్యూస్టుడే: పుదుచ్చేరి ముత్తియాల్పేట్టై సోలైనగర్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక మార్చి 2న హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన గంజాయి బానిసలుగా ఉన్న వివేకానందన్ (57), కరుణాస్ (19)ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కొన్నిరోజుల క్రితం పుదుచ్చేరి పోక్సో ప్రత్యేక కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. పోక్సో కేసులో 60 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలి. ఆ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం పుదుచ్చేరి ఈస్ట్ ఎస్పీ లక్ష్మి నేతృత్వంలో ముత్తియాల్పేట్టై పోలీసులు అభియోగపత్రం సిద్ధం చేశారు. 600 పేజీల దర్యాప్తు నివేదికను డీజీపీకి, న్యాయశాఖ సలహాల కోసం పంపారు. వారి సలహాల మేరకు ఏవైనా సవరణలు ఉంటే చేసి కోర్టులో దాఖలు చేయనున్నారు.
నిర్మలాదేవికి 10 ఏళ్ల జైలు
ప్యారిస్, న్యూస్టుడే: కళాశాల విద్యార్థినులను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లిన కేసులో ప్రొఫెసరు నిర్మలాదేవికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో నిర్మలాదేవిని దోషిగా తేలుస్తూ సోమవారం శ్రీవిల్లిపుత్తూర్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆమె తరఫున న్యాయవాది వాదిస్తూ.. తక్కువ శిక్ష విధించాలని, అదేవిధంగా తమ తరఫు వాదనలు తెలిపేందుకు శిక్షను వాయిదా వేయాలని కోరడంతో శిక్ష వివరాలను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం నిర్మలాదేవి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిర్మలాదేవి వల్ల బాధింపునకు గురైనట్లు ఫిర్యాదు చేసిన వారు సమాజంలో మామూలుగానే జీవిస్తున్నారని, ఆమె వలన ఏవిధంగానూ ప్రభావితం అయినట్లు కనిపించడం లేదన్నారు. కావున ఆమెకు శిక్ష తగ్గించాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి... నిర్మలాదేవికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2.45 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పునరుత్పాదక విద్యుత్తులో మూడో ర్యాంకు
[ 21-05-2024]
రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది. -
పలు భాషల్లోకి పార్కింగ్
[ 21-05-2024]
రాంకుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో హరీశ్ కల్యాణ్, ఎం.ఎస్.భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్’. ఒకే భవనంలో పైఅంతస్తు, -
మరింతమందికి మగళిర్ ఉరిమై
[ 21-05-2024]
అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై’ పథకంలో మరికొంతమంది లబ్ధిదారులను చేర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో జూన్ 4 తర్వాత కొత్తగా లబ్ధిదారుల చేర్పు పనులు చేపట్టనుందని సమాచారం. -
ప్రజా సమస్యలు పట్టని సీఎం
[ 21-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్కు ప్రజా సమస్యల పరిష్కారంపై ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... -
లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: ఎడప్పాడి పళనిస్వామి
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. -
పుదుచ్చేరిలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తాం
[ 21-05-2024]
పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్ఛార్జ్ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. లేదంటే రాజ్నివాస్కే వచ్చి అడగవచ్చన్నారు. -
బంకమట్టి, అట్టపెట్టెలతో రాయల్ఎన్ఫీల్డ్
[ 21-05-2024]
బంకమట్టి, అట్టపెట్టెలతో ఓ విద్యార్థిని రాయల్ఎన్ఫీల్డ్ వాహనం తయారు చేసింది. శ్రీకమలి అనే విద్యార్థిని తిరుప్పూర్ మదలిపాళ్యంలోని నిఫ్ట్-టీ అనే నిట్టింగ్, ష్యాషన్ డిజైనింగ్ కళాశాలలో కాస్ట్యూమ్ డిజైనింగ్, ఫ్యాషన్ విభాగంలో మూడో ఏడాది చదువుతోంది. -
నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం
[ 21-05-2024]
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. -
కాంగ్రెస్ నుంచి వైదొలగినవారిని మళ్లీ చేర్చుకోం
[ 21-05-2024]
కాంగ్రెస్ నుంచి వైదొలగినవారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోబోమని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. దివంగత ప్రధాని రాజీవ్గాంధీ సార్మక దినం సందర్భంగా ఏటా కర్ణాటక కాంగ్రెస్ కార్మికుల విభాగం తరఫున రాజీవ్గాంధీ జ్యోతియాత్ర జరుగుతుంది. -
13 ఏళ్ల కిందట బాలిక అదృశ్యం
[ 21-05-2024]
అదృశ్యమైన బాలికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో గుర్తించేందుకు చెన్నై చర్యలు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన గణేశ్ కుమార్తె కవిత రెండేళ్ల వయసులో 2011లో అదృశ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఏ హయాంలో పదేళ్లు ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్!
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు