ఐలాండ్ మైదానానికి బ్రాడ్వే బస్టాండ్
చెన్నై బ్రాడ్వే బస్టాండ్ను తాత్కాలికంగా ఐలాండ్ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్గా ఉండేది.
ఆర్కేనగర్, న్యూస్టుడే: చెన్నై బ్రాడ్వే బస్టాండ్ను తాత్కాలికంగా ఐలాండ్ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్గా ఉండేది. ఆ తర్వాత కోయంబేడు బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్రాడ్వే బస్టాండ్ను చెన్నై కార్పొరేషన్ బస్సులు నడిచే ప్రాంతంగా మార్చారు. అంతదూరంలో ఉన్న కోయంబేడుకు వెళ్లి బస్సులు ఎక్కలేమని ప్రజలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కోయంబేడు ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్టాండ్గా, స్థానిక బస్టాండ్గాను ఏర్పాటుచేశారు. ‘మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్’ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ నిర్మించేందుకు దానిని తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం ఐలాండ్ మైదానంలో చెన్నై కార్పొరేషన్ ద్వారా రూ.5 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. కొద్దినెలల్లోనే తరలించనున్నారు. ఆ తర్వాత బ్రాడ్వే బస్టాండ్ కూల్చివేసి ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. అక్కడ తొమ్మిది అంతస్తులతో కూడిన వాణిజ్య ప్రాంగణంతో కూడిన బస్టాండ్ నిర్మించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల