సముద్రంలో జాలర్లపై దాడి
సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది.
గాయపడిన మత్స్యకారులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది. వేలాంగన్ని సమీపంలోని సెరుదూర్ మత్స్యకార గ్రామం నుంచి మురుగన్ అనే వ్యక్తికి సొంతమైన పడవలో మురుగన్, లింగం, ముత్తుచిన్నయన్ సముద్రంలోకి వెళ్లారు. మంగళవారం 20 మైళ్ల దూరంలో చేపలు పడుతుండగా ఆ సమయంలో అక్కడికొచ్చిన ముగ్గురు చేతిలో ఉన్న కర్రలతో దాడి చేశారు. వారి పడవలో ఉన్న జీపీఎస్, వాకీటాకీ, వలలు, 40కిలోల చేపలు దోచుకెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోగా అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడుల నుంచి కోస్ట్గార్డ్ పోలీసులు, భారత నావికాదళం కాపాడాలని జాలర్లు విన్నవించారు.
టీఎంసీ ఖండన..
వేళచ్చేరి: తమిళ మత్స్యకారులపై దాడిని ఖండిస్తున్నామని టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్ పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రాత్రి నాగై జిల్లాకు చెందిన జాలర్లు పడవల్లో కరోడియక్కరై వద్ద నడి సముద్రంలో చేపల వేట కొనసాగిస్తుండగా అక్కడికి వచ్చిన శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు మారాణాయుధాలతో దాడి జరపడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీలంక సముద్రపు దొంగల చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖండిచాలని కోరారు. మత్స్యకారుల జీవనాధారమైన చేపలవేట కాపాడటానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పునరుత్పాదక విద్యుత్తులో మూడో ర్యాంకు
[ 21-05-2024]
రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది. -
పలు భాషల్లోకి పార్కింగ్
[ 21-05-2024]
రాంకుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో హరీశ్ కల్యాణ్, ఎం.ఎస్.భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్’. ఒకే భవనంలో పైఅంతస్తు, -
మరింతమందికి మగళిర్ ఉరిమై
[ 21-05-2024]
అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై’ పథకంలో మరికొంతమంది లబ్ధిదారులను చేర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో జూన్ 4 తర్వాత కొత్తగా లబ్ధిదారుల చేర్పు పనులు చేపట్టనుందని సమాచారం. -
ప్రజా సమస్యలు పట్టని సీఎం
[ 21-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్కు ప్రజా సమస్యల పరిష్కారంపై ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... -
లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: ఎడప్పాడి పళనిస్వామి
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. -
పుదుచ్చేరిలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తాం
[ 21-05-2024]
పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్ఛార్జ్ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. లేదంటే రాజ్నివాస్కే వచ్చి అడగవచ్చన్నారు. -
బంకమట్టి, అట్టపెట్టెలతో రాయల్ఎన్ఫీల్డ్
[ 21-05-2024]
బంకమట్టి, అట్టపెట్టెలతో ఓ విద్యార్థిని రాయల్ఎన్ఫీల్డ్ వాహనం తయారు చేసింది. శ్రీకమలి అనే విద్యార్థిని తిరుప్పూర్ మదలిపాళ్యంలోని నిఫ్ట్-టీ అనే నిట్టింగ్, ష్యాషన్ డిజైనింగ్ కళాశాలలో కాస్ట్యూమ్ డిజైనింగ్, ఫ్యాషన్ విభాగంలో మూడో ఏడాది చదువుతోంది. -
నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం
[ 21-05-2024]
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. -
కాంగ్రెస్ నుంచి వైదొలగినవారిని మళ్లీ చేర్చుకోం
[ 21-05-2024]
కాంగ్రెస్ నుంచి వైదొలగినవారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోబోమని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. దివంగత ప్రధాని రాజీవ్గాంధీ సార్మక దినం సందర్భంగా ఏటా కర్ణాటక కాంగ్రెస్ కార్మికుల విభాగం తరఫున రాజీవ్గాంధీ జ్యోతియాత్ర జరుగుతుంది. -
13 ఏళ్ల కిందట బాలిక అదృశ్యం
[ 21-05-2024]
అదృశ్యమైన బాలికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో గుర్తించేందుకు చెన్నై చర్యలు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన గణేశ్ కుమార్తె కవిత రెండేళ్ల వయసులో 2011లో అదృశ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి