వృథా నీటితో ఆదాయం
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది.
ఐఐటీఎంలో సీజడ్సీ 4.0
25 మంది బృందంతో ఆచార్యులు ఇందుమతినంబి తదితరులు
వడపళని, న్యూస్టుడే: కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. టాప్ 25 బృందాల పేర్లను ఐఐటీ ప్రకటించింది. జనవరిలో సీజడ్సీ లాంఛనంగా ప్రారంభమైంది. 13 స్టార్టప్స్, 42 మంది పరిశోధకులు, 8 మంది అధ్యాపకులు ఎంట్రప్రెన్యూర్లుగా అయ్యేందుకు సీజడ్సీ ప్రత్యేక చొరవ తీసుకుంది. 25 బృందాల్లో ప్రారంభదశలో ఉన్న స్టార్టప్స్, అధ్యాపకులు, పరిశోధకులు.. నీరు, వృథా నీటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి మార్గాలు, పునరుత్పాదక విద్యుత్తు, వ్యర్థాల నిర్వహణవంటివి ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఆరు నెలల శిక్షణతో పాటు వారి శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకొచ్చేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందనుంది. ఇందుకు ఫ్రెంచి మల్టీ నేషనల్ సంస్థ థేల్స్, ఐఐటీఎంలోని ఆక్వామాప్ సెంటర్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ సహకరించనున్నాయి.
ప్రసంగిస్తున్న ఏఆర్ రాహుల్నాథ్
850 దరఖాస్తులు
తాజాగా విడుదలైన సీజడ్సీ 4.0 ఎడిషన్కు 850 దరఖాస్తులందాయి. 25 రాష్ట్రాలు, 25 బృందాలు రాసిన పరిశోధనలను 50 మంది నిపుణులు పరిశీలించారు. స్థిరత్వం కలిగిన పరిశోధనలకు సీజడ్సీ 4.0 అనేది థీమ్లా ఉంటుందని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పుల విభాగ డైరెక్టరు ఏఆర్ రాహుల్నాథ్ అన్నారు. పరిశోధకులు పర్యావరణం, వాతావరణంలో మార్పుల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఐఐటీ డైరెక్టరు, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ ఐఐటీఎంలో వందశాతం నీటిని శుద్ధి చేస్తున్నామన్నారు. సస్టెయినబులిటీ(స్థిరత్వం) అనేది అన్ని రంగాలకు ఎంతో అవసరమని చెప్పారు. ఐఐటీఎంలోని స్కూల్ ఆఫ్ సస్టెయినబులిటీలో 80మందికిపైగా అధ్యాపకులు, వంద మంది విద్యార్థులున్నారని, వారంతా నీటి కోసం పబ్లిక్ పాలసీ, పునరుత్పాదక విద్యుత్తు, బ్యాటరీ విధానం, విద్యుత్తు వాహనాలు వంటి వాటిపై పని చేస్తున్నారని చెప్పారు. పరిశోధనల ద్వారా కొత్త స్టార్టప్స్లను మార్కెట్లోకి తీసుకురావాలన్నదే లక్ష్యంగా ఉందని కామకోటి అన్నారు. సీజడ్సీ కో-ఆర్డినేటర్, ఆచార్యులు, ప్రిన్సిపల్ ఇందుమతి నంబి, స్కూల్ ఆఫ్ సస్టెయినబులిటీ అసోసియేట్ ఫ్యాకల్టీ, ఆచార్యులు రజనీష్కుమార్ తదితరులు ప్రసంగించారు.
వి.కామకోటి
ఎంపికైన బృందాలివి..
ఐఐటీ కార్బన్ ఎయిర్ పరిశోధక బృందం, నోయిడా అమిటీ వర్సిటీ జి.ఎల్ఈడీ పరిశోధకులు, యోటహ్ ఎనర్జీ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ యోటహ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీ ప్రవాహన్ విద్యార్థులు, బెంగళూరు ప్రీయిన్క్యుబాటెడ్ ఎర్లీ స్టేజి స్టార్టప్స్ క్విక్హిల్ తదితర 25 బృందాలను ఎంపిక చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి
[ 04-05-2024]
కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు. -
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM