పోలీసులు స్వతంత్రంగా పనిచేస్తే నిందితులను గంటలో గుర్తిస్తారు
తిరునెల్వేలి కాంగ్రెస్ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు.
ఆర్బీ ఉదయకుమార్
ప్యారిస్, న్యూస్టుడే: తిరునెల్వేలి కాంగ్రెస్ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. పోలీసులను స్వతంత్రంగా పనిచేయనిస్తే నిందితులను గంటలో గుర్తిస్తారని చెప్పారు. మదురైలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిందన్నారు. మూడేళ్లలో జనం విద్యుత్తు ఛార్జీల పెంపు, ఆస్తి పన్ను, పాలు, నిత్యావసర వస్తువుల పెరుగుదల అని 30 ఏళ్ల భారం మోస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకం అయిందన్నారు. అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మొదటిస్థానంలో ఉందన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలు పెంచమని చెప్పారని ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. నీట్ పరీక్ష, విద్యారుణం రద్దు కూడా అదే కోవలోకి చేరుతాయన్నారు. రూ.1000 ఇంకా కోటి మందికిపైగా అందాల్సి ఉందని గుర్తు చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రజలకు మోసాన్ని బహుమతిగా ఇచ్చిందన్నారు. వారిని నమ్మేందుకు జనం సిద్ధంగా లేరన్నారు. ఎడప్పాడి పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు