జయకుమార్ లేఖలో అంశాలు అవాస్తవం
తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు
మద్దతుదారులతో మాట్లాడుతున్న తంగబాలు
టీనగర్, న్యూస్టుడే: తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఆయన రాసినట్లుగా పేర్కొన్న లేఖలను ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించారు. రెండింటిలోనూ ఆయన చేతిరాతే ఉన్నట్లు నిర్ధారించారు. డబ్బు లావాదేవీల వ్యవహారంలో టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, నాంగునేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే రూబి మనోహరన్తో పాటు మరికొంది పేర్లు లేఖల్లో ఉన్నాయి. వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు పంపారు. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు హాజరైన అనంతరం తంగబాలు విలేకర్లతో మాట్లాడారు. జయకుమార్ తనకు రూ.11 లక్షలు ఇచ్చారని, ఆ మొత్తాన్ని రూబి మనోహరన్ నుంచి తీసుకోవాల్సిందిగా ఆయనకు తాను సూచించినట్లు లేఖలో ఉందన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. జయకుమార్ మృతిపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు