అర్ధరాత్రి నుంచి అమల్లోకి ఈ-పాస్ విధానం
పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్కు పర్యాటకులు వరుసకట్టారు.
నీలగిరి చెక్పోస్టులో ఈ-పాస్లు పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది
విల్లివాక్కం, ఆర్కేనగర్, న్యూస్టుడే: పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్కు పర్యాటకులు వరుసకట్టారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. వారి వాహనాలతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. అంతే కాకుండా వసతి గృహాలు, మరుగుదొడ్ల సౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది జిల్లా యంత్రాంగం 7వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఊటీ, కొడైకెనాల్కు వచ్చేవారికి ‘ఈ-పాస్’ తప్పనిసరి చేసింది. అందుకుగాను మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.
కొడైకెనాల్ చెక్పోస్టులో..
ఆ మేరకు మంగళవారం ‘ఈ-పాస్’ విధానం అమల్లోకి వచ్చింది. బయటి ప్రాంతాల నుంచి నీలగిరి వస్తున్న వాహనాలకు ‘ఈ-పాస్’ ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లా సరిహద్దు కల్లార్ చెక్పోస్టులో జిల్లా రెవెన్యూ అధికారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు మొదలుపెట్టారు. జిల్లా సరిహద్దులోని 12 ప్రాంతాలలో ఈ తనిఖీలు చేపడుతున్నారు. పర్యాటకులు www.tnega.tn.gov.in అనే వెబ్సైట్లో ‘ఈ-పాస్’కు దరఖాస్తు చేసుకోవచ్చు. మంగళవారం మొత్తం 21,446 వాహనాలకు ఈ-పాస్ ఇచ్చారు. పాస్ లేకుండా వచ్చిన వాహనాలను నీలగిరి జిల్లా సరిహద్దుల్లో అధికారులు తిప్పి పంపుతున్నారు. ఒకేసారి చాలామంది పాస్లు పొందేందుకు వెబ్సైట్లోకి వెళ్లడంతో సాంకేతిక సమస్య తలెత్తుతోంది. అదేవిధంగా స్థానిక వాహనదారులు పాస్ పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. దిండుక్కల్ జిల్లా కలెక్టర్ పూంగుడి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో... ఈ-పాస్కు సంబంధించి సందేహాలకు, స్థానిక వాహనదారులు లోకల్ ఈ-పాస్ పొందడంలో తలెత్తే సందేహాలను 0451 2900233, 94422 55737 అనే ఫోన్ నెంబర్లపై సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు