రైలు పట్టాలపై అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలోని మార్లాపల్లి గెడ్డపై కిరండోల్ లైన్లోని ఎల్.కోట, మల్లివీడు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఎల్.కోట, న్యూస్టుడే: విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలోని మార్లాపల్లి గెడ్డపై కిరండోల్ లైన్లోని ఎల్.కోట, మల్లివీడు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని, ముఖం నుజ్జవ్వడంతో గుర్తుపట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొందని శనివారం తెలిపారు. రైల్వే సీఐ కె.వెంకటరావు అందించిన వివరాలు ప్రకారం.. వీఏఏ రోడ్డు (విశాఖ, అనంతగిరి, అరకు) నుంచి మృతదేహాన్ని ఈడ్చుకుని వచ్చి పడేసినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆయన ఫ్యాంటు జేబులో ఒక యువతి ఫొటో ఉందని చెప్పారు. మృతుడి శరీరంపై సుకన్య, పీఎస్పీ, డార్లింగ్, వాసు, వి.ఫారెన్ పేరిట పచ్చబొట్లు ఉన్నట్లు చెప్పారు. కుడిచేతికి సిల్వర్ కలర్ బ్రాస్లెట్ ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరానికి తరలించామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ కె.వెంకటరావు తెలిపారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్