కొత్తగా కనిపెడదాం.. రండి..!
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన ఆవిష్కరణలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐడియా ల్యాబ్ (ఐడియా డెవలప్మెంట్, ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్ ల్యాబ్) ఉపకరిస్తుంది.
అందుబాటులోకి ‘ఐడియా ల్యాబ్’
న్యూస్టుడే, కూర్మన్నపాలెం(దువ్వాడ): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన ఆవిష్కరణలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐడియా ల్యాబ్ (ఐడియా డెవలప్మెంట్, ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్ ల్యాబ్) ఉపకరిస్తుంది.
ఐఓటీ పరిజ్ఞానంతో మెకానికల్ విద్యార్థులు తయారు చేసిన కన్వేయర్ బెల్ట్
‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆర్థికసాయంతో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్లో(ఎస్టీఈఎం) విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐడియా ల్యాబ్లను ప్రవేశపెట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆసక్తి గల కళాశాలలను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలను ఎంపిక చేసింది. ఇక్కడ వివిధ పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమల్లో పని చేసే ఆశావహులకు శిక్షణ ఇస్తారు.
* ఇండస్ట్రీ 4.0 : ఐఓటీ ఆధారిత కన్వేయర్ బెల్ట్ రూపొందిస్తున్నారు. పరిశ్రమల్లో వినియోగించే కన్వేయర్ బెల్ట్ విధానాన్ని ఐఓటీ అనుసంధానం చేసి, చరవాణితో పని చేసేలా సిద్ధం చేశారు. విశాఖ పోర్టు ట్రస్టు అవసరాలకు అనుగుణంగా ఈ నమూనా తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు.
* 3డీ ప్రింటింగ్ : కంప్యూటర్లో అవసరమైన మాడ్యూల్ సిద్ధం చేసి, దానికి 3డీ ప్రింటింగ్కు అనుసంధానం చేస్తే ఆకర్షణీయమైన ప్రింటింగ్ వస్తుంది. టీ షర్టులు, గ్లాసులు, కీ చైన్స్..తదితర పరికరాలపై మనకు నచ్చిన బొమ్మలు ముద్రించుకునేలా తయారు చేశారు.
అడుగు పడిందిలా...
* ల్యాబ్ల ఏర్పాటుకు దేశ వ్యాప్తంగా ఉన్న కళాశాల నుంచి ఏఐసీటీఈ ఆన్లైన్ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఇందులో విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల యాజమాన్యం, స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో రూ.1.98 కోట్ల నిధులతో ల్యాబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
* స్థానికంగా పరిశ్రమల భాగస్వామ్యం లేకపోవడంతో ఏఐసీటీఈ రూ.55 లక్షలు, కళాశాల వాటాగా రూ.50 లక్షలు మొత్తం కలిపి రూ.1.05 కోట్లతో ఈ ఏడాది
జనవరి 11న ల్యాబ్ ప్రారంభించారు. ఐఓటీ పరిజ్ఞానంతో మెకానికల్ విద్యార్థులు తయారు చేసిన కన్వేయర్ బెల్ట్
రూపొందించిన పరికరాలు..
* ల్యాబ్లో మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేధ (ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్-ఏఐ) వినియోగించి అత్యాధునికి ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇస్తున్నారు.ఐఓటీ సాయంతో హోమ్ ఆటోమెషిన్, హోమ్ సెక్యూరిటీ సిస్టంలు రూపొందించారు.
* హోమ్ ఆటోమెషిన్ : ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాల్ని చరవాణి సాయంతో వెలిగించి, ఆర్పేసేలా (ఆన్/ఆఫ్) పరికరాన్ని తయారు చేశారు. ఇంట్లో ఉన్నా, ఇంటికి దూరంగా ఉన్నా ప్రతిసారి స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లకుండానే చరవాణితో నిర్వహణకు వీలుంటుంది.
* హోమ్ సెక్యూరిటీ సిస్టం : చోరీలు నియంత్రించేలా కొత్త పరికరం రూపొందించారు. ఇంట్లో నివాసితులు బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తాళాలు విరగ్గొటి, దొంగతనానికి ప్రయత్నిస్తే ఇంట్లో అయిదుగురు సభ్యుల చరవాణులకు సంక్షిప్త సమాచారం అందుతుంది. వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి... చోరీల నియంత్రణకు తోడ్పడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
[ 04-05-2024]
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన