icon icon icon
icon icon icon

వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్‌ చేసిన అధికారులు

నగరంలో భారీగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Updated : 04 May 2024 14:09 IST

విశాఖ: నగరంలో భారీగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలు శుక్రవారం రాత్రి ఆయన కార్యాలయంపై దాడులు చేశాయి. సుమారు ఆరు గంటలకు పైగా అధికారులు సోదాలు చేశారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డుల్లో కూపన్లు, డిజిటల్ వాచ్‌లు, గాజులు, చీరలు, నగదు పంచేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. రాత్రి సుమారు 2 గంటల వరకు సోదాలు నిర్వహించారు.

ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితో పాటు ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సన్నిహితుడు జి.వెంకటేశ్వరరావు కార్యాలయంలోనే ఉన్నారు. అధికారులు కార్యాలయ సిబ్బందిని విచారించారు. ఈ దాడిలో 25 నుంచి 30 మంది అధికారులు పాల్గొన్నారు. సోదాల అనంతరం చీరలు, కూపన్లు, ఇతర సామగ్రి, నగదును సీజ్ చేసి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img