logo

తెదేపా ఆవిర్భావ వేడుకలు నేడే

తెదేపా ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు.

Published : 29 Mar 2023 03:15 IST

సమావేశంలో పీలా, సురేంద్ర, గణేష్‌ తదితరులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ తెదేపా కార్యాలయాల్లో ఇన్‌ఛార్జ్‌ల పర్యవేక్షణలో తెదేపా సీనియర్‌ కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యులు, బాలకృష్ణ అభిమానులను సత్కరిస్తామన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. నాలుగు దశాబ్దాలుగా పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా పని చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, సబ్బవరపు గణేష్‌, కొణతాల శ్రీనివాసరావు, పోలారపు త్రినాథ్‌, పచ్చికూర రాము, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని