పెళ్లికెందుకు తొందర.. చదువుకోనీ ముందర..
‘ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే పరువు పోతుంది. ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినలేదు.
బాల్యంలో ‘మూడు ముళ్లు’ పడకుండా..
అనకాపల్లి కేంద్రంగా పర్యవేక్షణ విభాగం
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే
‘ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే పరువు పోతుంది. ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినలేదు. మాట వినకపోతే పెళ్లి కుదిర్చిన వారు, సహకరించిన వారు, పెళ్లి చేస్తున్న వారు అందరూ చట్టపరమైన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి ఆపేశారు. గత ఏడాది నర్సీపట్నం పురపాలక సంఘంలో చోటు చేసుకున్న ఘటన ఇది.
ఒక పక్క పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వధూవరులు మండపానికి వచ్చేశారు. ఇంకో పక్క బంధువులంతా విందు భోజనాలు చేస్తున్నారు. ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు. ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు వచ్చేశారు. పెళ్లికుమార్తెకు పద్దెనిమిదేళ్లు నిండలేదు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ‘ఇంతదాకా వచ్చాక.. ఇప్పుడెలా పెళ్లి ఆపగల’మంటూ ఇరువర్గాల వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
పదిహేను నుంచి పదిహేడేళ్ల వయసులోనే.... ఆడపిల్లలకు పెళ్లి చేయాలని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, చట్టాలపై అవగాహన లేమి, త్వరగా పెళ్లి చేసి బరువు బాధ్యతలు తీర్చుకోవాలనుకోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. బాలికల రక్షణ, సంరక్షణ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగానే కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమాలను కొనసాగించేలా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మిగతా శాఖలనూ సమన్వయం చేసుకుంటూ చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్న సూచనలున్నాయి. బాల్య వివాహాల వల్ల అనర్థాలను వివరించేందుకు, ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలని చట్టం చెబుతోంది. పరిస్థితులు ఎలాంటివైనా ఈలోపు వయసున్న వారికి పెళ్లి చేయడానికి యత్నించిన వారు, సహకరించిన వారు శిక్షార్హులు.
ఫిర్యాదు అందగానే అధికారుల బృందం వెళ్లి పెళ్లిని అడ్డుకుంటున్నా.. కొద్దిరోజుల తర్వాత గుట్టుగా గుడిలో మూడు ముళ్లు వేయిస్తున్న పరిస్థితులున్నాయి. మరింత అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
బాల్య వివాహాలపై ప్రచార గోడపత్రిక
ఎదిగీఎదగని వయసులో ఆడపిల్లల మెడలో పడే మూడు ముళ్లు ఎన్నో పీటముడులకు కారణమవుతాయి. పద్దెనిమిదేళ్లలోపు వయసులో పెళ్లయితే పుస్తకాలు పక్కనపెట్టి పిల్లల్ని, కుటుంబ బాధ్యతలను మోయక తప్పదు. పెన్ను పట్టాల్సిన చేయి గరిటె తిప్పకా తప్పదు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అధికారులు ఎంతగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. బాలికా విద్యను ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సహిస్తున్నా.. ఒక్కటో ఒకచోట అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో 42 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. వీరి దృష్టికి రాకుండా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.
ఉపేక్షించేది లేదు: బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇవి జరగకుండా అన్ని స్థాయిల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వివాహ ముహూర్తాలున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. ఇరువర్గాల తల్లిదండ్రులకు ముందుగానే చట్టాలను, చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎదురయ్యే కష్టనష్టాలను వివరిస్తాం.
జి.ఉషారాణి, సంచాలకురాలు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!