మంత్రి అనుచరుడి మాయాజాలం
వివాదాస్పద భూములు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారు.. సెటిల్మెంట్లు చేస్తూ సొమ్ములు చేసుకోవడమే కాకుండా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ గుప్పిటలోకి తెచ్చుకుంటున్నారు.
జీవీఎంసీ స్థలంలో రహదారి తొలగింపు
రూ.కోట్ల విలువైన జాగా స్వాహా యత్నం
పురపాలక సంఘం క్వార్టర్లలోని ఇళ్లు
వివాదాస్పద భూములు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారు.. సెటిల్మెంట్లు చేస్తూ సొమ్ములు చేసుకోవడమే కాకుండా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ గుప్పిటలోకి తెచ్చుకుంటున్నారు. దీనికి తమ నేతల పేర్లను వాడుకుంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అనకాపల్లిలోని జీవీఎంసీకి చెందిన విలువైన స్థలాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుడు ఒకరు దర్జాగా కబ్జాచేసి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టేస్తున్నాడు. వైఎస్ఆర్ యువజన విభాగం నేతగా పేరొందిన ఈ నాయకుడు కొనుగోలు చేసిన స్థలం 65 గజాలే. అయితే రికార్డుల్లో మార్పులు చేసి 800 గజాల స్థలంగా చూపించి భవన నిర్మాణానికి అనుమతులు తెప్పించుకున్నాడు. సదరు నాయకుడు జీవీఎంసీకి చెందిన మరో స్థలంపైనా కన్నేసి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నాడు.
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి: అనకాపల్లి గుండాల కూడలి వద్ద పురపాలక సంఘం స్థలంలో అయిదు దశాబ్దాల క్రితమే కమిషనర్, సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సిబ్బంది కోసం 65 గజాల స్థలం విస్తీర్ణంతో కూడిన ఎల్ఐజీ టైప్ ఇళ్లు కట్టారు. ఈ ఎల్ఐజీ ఇళ్లలోని ఒక ఇంటిలో నివాసం ఉండే పారిశుద్ధ్య విభాగం అధికారి పదవీ విరమణ తర్వాత ఖాళీ చేయలేదు. ఆ ఇల్లు తనకే చెందుతుందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పురపాలక సంఘం అధికారులు పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానం ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది మూడు దశాబ్ధల కిత్రం జరిగింది. ఆ ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని భార్య నుంచి ఇంటి స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో తెదేపాలో ఉన్న ఈ వైకాపా యువజన విభాగం నాయకుడు మరో ఇద్దరితో కలిపి కొనుగోలు చేశారు. ఆ సమయంలో రికార్డుల్లో ట్యాంపరింగ్ చేసి 65 గజాలను 800 గజాలుగా మార్చేసి జీవీఎంసీ స్థలం మొత్తాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం. వైకాపా సర్కారు వచ్చిన తర్వాత ముగ్గురి పేరునున్న ఈ స్థలం మొత్తాన్ని అధికార పార్టీ యువజన నాయకుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణానికి జీవీఎంసీ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్ఐజీ ఇంటిని 65 గజాల స్థలంలో నిర్మిస్తారు. మరి 600 గజాల స్థలంలో నిర్మాణాలకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. మంత్రికి శిష్యుడు కావడంతో అధికారులు అనుమతులిచ్చేటప్పుడు ముందూ వెనుకా చూడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారిని ఆనుకొని ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 కోట్లు ఉంటుంది. ఈ బాగోతం తెలుసుకున్న సీపీఎంల్, సీపీఎం, సీపీఐ నాయకులు జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ స్థలాన్ని స్వాదీనం చేసుకుని అందులో పౌర గ్రంథాలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
80 అడుగుల రహదారి
మాస్టర్ ప్లాన్ మార్చి..
గత మాస్టర్ ప్లాన్లో బెల్లం మార్కెట్ యార్డును ఆనుకొని రింగ్ రోడ్డు నుంచి సబ్బవరం రోడ్డు వరకు 80 అడుగుల రహదారి ఉండేది. ఈ ప్రాంతంలో వుడా అనుమతితో రెండు లేవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం 80 అడుగుల రహదారిని ఏర్పాటు చేశారు. ఆమేరకు రహదారి స్థలాన్ని ప్రభుత్వానికి రాసి ఇచ్చారు. ఈ రెండు లేవుట్లలో రహదారి కోసం విడిచిపెట్టిన స్థలం దాదాపు 35 సెంట్లు ఉంది. దీనివిలువ రూ.14 కోట్ల వరకు ఉంటుంది. ఈ స్థలంపై కన్నేసిన యువజన విభాగం నాయకుడు ఇటీవల కొత్తగా తయారు చేసిన మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల రోడ్డును తొలగించే విధంగా మంత్రితో చెప్పించి విజయం సాధించారు. ఈ ప్రాంతంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మహిళ సహాయంతో రోడ్డు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఖాళీ స్థలం పన్ను వేయాల్సిందిగా జీవీఎంసీకి లేవుట్ వేసిన యజమానులలో ఒకరిచే దరఖాస్తు చేయించారు. విషయం తెలుసుకున్న కొందరు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దస్త్రాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కొద్ది రోజులు పోయిన తర్వాత మంత్రితో చెప్పించి అనుమతులు పొందొచ్చని ఆ యువనేత ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. స్థలాల కబ్జా విషయమై జోనల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ వద్ద ప్రస్తావించగా గుండాల కూడలిలోని భవనానికి 2018లోనే అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇటీవల రెన్యూవల్ మాత్రమే చేసినట్లు చెప్పారు. వుడా అనుమతి పొందిన లేఅవుట్లోని పాత రహదారి స్థలంలో ఖాళీ స్థలానికి పన్ను వేయాల్సిందిగా దరఖాస్తు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఆ స్థలం ప్రభుత్వానికి రాసి ఇచ్చినందున ఇతరులకు అనుమతులు ఇచ్చేది లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ