ఇంటింటి నుంచి బయోమెట్రిక్..!
మాకు ప్రభుత్వ పథకం ఒక్కటీ అందడం లేదు. ఎటువంటి ధ్రువీకరణ పత్రమూ కోరుకోవడం లేదు. అయినా బయోమెట్రిక్ వేయాలని, ఫొటో తీసుకుంటామని ఎందుకు అడుగుతున్నారు.
పథకాలు అందకపోయినా వేయాల్సిందే
ఒత్తిడి తెస్తున్న వాలంటీర్లు
కార్పొరేషన్, న్యూస్టుడే
* మాకు ప్రభుత్వ పథకం ఒక్కటీ అందడం లేదు. ఎటువంటి ధ్రువీకరణ పత్రమూ కోరుకోవడం లేదు. అయినా బయోమెట్రిక్ వేయాలని, ఫొటో తీసుకుంటామని ఎందుకు అడుగుతున్నారు. ఒక వేళ అది దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు’ ఇటీవల చినముషిడివాడలో స్థానికుల నుంచి వాలంటీర్లకు ఎదురైన ప్రశ్న ఇది? ఎటువంటి లబ్ధి చేకూరకపోయినా బయోమెట్రిక్ తీసుకోవాలని పైస్థాయి నుంచి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయని వాలంటీర్లు చెబుతున్నారు.
* వైకాపా ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి ఇష్టానుసారంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద 12 రకాల సేవలను ప్రజలకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీరు తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి, నివాసితులకు కావాల్సిన ధ్రువీకరణపత్రాల కోసం ఆరా తీయడంతోపాటు, దరఖాస్తు చేయిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను పరిధిలో ఉన్నవారు, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరంలేని వారి ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్, ఛాయాచిత్రం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో బయోమెట్రిక్ను ఉపయోగించి ఆధార్ నెంబరు సాయంతో బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేసిన ఘటనలు వెలుగు చూశాయని పలువురు గుర్తు చేస్తున్నారు.
* వాలంటీర్లు ఇంటింటికి వెళ్లారో లేదో తెలుసుకోవడానికే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. పథకాలు పొందని వారు, ఎటువంటి ధ్రువీకరణపత్రాలు కోరని వారు బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు. అయితే కొంత మంది వాలంటీర్లు ‘జగనన్న సురక్ష’లో ఎలాంటి ధ్రువీకరణపత్రాలు ఇస్తారు, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తారనే విషయాలను లబ్ధిదారులకు వివరించకుండానే, యాప్లో ఉన్న కాలమ్స్ అన్నీ నింపి, బయోమెట్రిక్ సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.
కొరవడిన పారదర్శకత
* అధికారులు చెప్పేది ఒకటి..వాలంటీర్లు చేసేది మరొకటిగా ఉండడంతో అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక, తమ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉందో తెలియక నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి ఎటువంటి జవాబుదారీతనం ఉండదని, వారికిచ్చిన సమాచారం ఎవరికి వెళుతుందో తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు. పారదర్శకత లేకపోవడం, వ్యక్తిగత సమాచారానికి బాధ్యత వహిస్తున్నామని ఏ ఒక్కరూ చెప్పకపోవడంతో ప్రజల్లో మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం
[ 17-05-2024]
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు