పన్ను భారం.. ఇదెక్కడి ఘోరం.. వాత వేసి వెన్న పూస్తున్న వైకాపా ప్రభుత్వం
జీవన పోరాటంలో నిత్యం తలమునకలయ్యే సగటు జీవికి ఒక చేత్తో సంక్షేమ పథకాలంంటూ ఆశలు చూపి మరో చేత్తో పన్నుల బాదుడుతో కుదేలు చేస్తోంది వైకాపా ప్రభుత్వం. జగనన్న తీరు వాత వేసి వెన్న పూస్తున్న చందంగా ఉందని జనాలు గగ్గోలు పెడుతున్నారు.
పెందుర్తి, వేపగుంట, పరవాడ, న్యూస్టుడే
జీవన పోరాటంలో నిత్యం తలమునకలయ్యే సగటు జీవికి ఒక చేత్తో సంక్షేమ పథకాలంంటూ ఆశలు చూపి మరో చేత్తో పన్నుల బాదుడుతో కుదేలు చేస్తోంది వైకాపా ప్రభుత్వం. జగనన్న తీరు వాత వేసి వెన్న పూస్తున్న చందంగా ఉందని జనాలు గగ్గోలు పెడుతున్నారు. గత మూడేళ్ల నుంచి ఆస్తి పన్ను విధింపులో విచిత్రమైన విధానాన్ని అమలు చేస్తూ విశాఖ నగర ప్రజలపై మోయలేని భారం మోపింది జగనన్న ప్రభుత్వం. గతంలో ఉన్న సంప్రదాయ విధానం కాకుండా 2021-22 సంవత్సరం నుంచి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేస్తూ ఏటా పన్ను పెంచుకుంటూ ప్రజలను పిండేస్తున్నారు. ఏటా 15 శాతం పన్ను పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పన్ను పెంపు విధానాన్ని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు వ్యతిరేకించినా ఏ మాత్రం పట్టించుకోకుండా నిరంకుశంగా పెంచడమే లక్ష్యంగా జీవీఎంసీ పాలకవర్గం ముందుకెళ్తోంది. పన్నుల భారం కారణంగా చెల్లించలేని వారికి నోటీసులు జారీ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మో ఇదెక్కడి బాదుడు..
వైకాపా ప్రభుత్వం విధిస్తున్న ఆస్తి పన్ను బాదుడు చూస్తుంటే గుండె గుబేల్మంటోంది. నాకో చిన్న ఇల్లు ఉంది. 2022లో ఆస్తి పన్ను రూ.1218 ఉండేది. తాజాగా ఈ ఏడాది రూ.1683 అయింది. ఇలా ఏటా పన్ను పెరుగుతూ పోతే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. కొత్త పన్ను విధానం వలన నాలాంటి సగటు జీవిపై భరించలేని భారం పడుతోంది. ఈ పద్ధతిని పునఃసమీక్షించి ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలి.
బి.వి.రమణమూర్తి, సుజాతనగర్
70 శాతం పెరిగింది..
నేను వెయ్యి గజాలలోపు ఇంట్లో నివాసం ఉంటున్నాను. గతంలో సుమారు రూ.1,100 ఇంటి పన్ను చెల్లించేవాడిని. ఈ ఏడాది రూ.1870 కట్టాల్సి వచ్చింది. సుమారు 70 శాతం మేర పన్ను పెంచారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇల్లు అమ్ముకుని అద్దె ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ప్రజలకు వస్తుంది. పన్నుల వసూళ్లపై చూపిన శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ చూపడం లేదు.
ఎ.వెంకటేశ్, పాపయ్యరాజుపాలెం
ఏటా 15 శాతం అంటే కష్టమే..
నేను ఓ ప్రైవేట్ కంపెనీలో అరకొర జీతానికి పని చేస్తున్నాను. 2020 వరకు ఆస్తి పన్ను మాకు తక్కువగానే వచ్చేది. 2021 నుంచి వైకాపా ప్రభుత్వం ఒక్కసారిగా ఆస్తి పన్నును పెంచేసింది. ఏటా 15 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికి మూడు పర్యాయాలు 45 శాతం పన్ను పెరిగిపోయింది. నాకు వచ్చిన జీతంలో పన్నులు చెల్లించేందుకే సరిపోతోంది. నాలాంటి పేద, మధ్య తరగతి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వెంటనే ఆస్తి పన్నును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గాలి కృష్ణమూర్తి, నరవ
నెలవారీ బడ్జెట్పై మరింత భారం
నేను, నా భార్య ఇద్దరం వృద్ధులు. మేము అద్దె ఇంటిలో ఉంటున్నాం. 2020 వరకు అద్దె తక్కువగానే ఉండేది. కొవిడ్ అనంతరం యజమాని ఒక్కసారిగా మా ఇంటి అద్దెను పెంచేశారు. ఇదేమిటని అడిగితే వైకాపా ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల తాము తప్పక పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో నెలవారీ బడ్జెట్పై భారం మరింత రెట్టింపయింది. చాలామంది అద్దె ఇళ్లల్లో ఉన్నవారంతా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేలా పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలి.
భాస్కరరావు, శ్రీసాయిమాధవనగర్
అధికారంలోకి రాగానే మడమ తిప్పేశారు..
మాట తప్పం.. మడం తిప్పం అని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మడమ తిప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్నులు పెంచమని చెప్పి తర్వాత ఏటా 15 శాతం పెంచుకుంటూ ప్రజలపై ఎనలేని భారం మోపారు. ప్రభుత్వం పన్నులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని వసతుల కల్పనలో విఫలమైంది. ఇలా చేయడం అన్యాయం. మా ఊరిలోని ప్రధాన రహదారిలో ఇప్పటికీ కొళాయి పైపులైన్ వేయలేదు. పన్నులు మాత్రం సకాలంలో వసూలు చేస్తున్నారు. రానున్న ప్రభుత్వంలోనైనా పన్నులు తగ్గుతాయని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
పాల నగేశ్, పాలవలస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ