logo

మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా

తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్‌తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 03:22 IST

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బండారు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్‌తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కూటమి అభ్యర్థిగా మాడుగుల నుంచి పోటీ చేయనున్న ఆయన శుక్రవారం కె.కోటపాడు మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీవీజీ కుమార్‌తో కలిసి గొట్లాం, శ్రుంగవరం, మర్రివలస, పాతవలస, సూదివలస గ్రామాల్లో పర్యటించారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను గెలిపిస్తే ప్రజలు ఓడిపోయినట్లేనన్నారు. రామానాయుడు, పీవీజీ కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం రమేశ్‌, బండారు విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని, మీరంతా అండగా నిలవాలని కోరారు. సీఎం సురేశ్‌నాయుడు, కన్నూరు నాగభూషణం, డోకల నర్సింహమూర్తి పాల్గొన్నారు.

చీడికాడ: చీడికాడ మండలం జి.కొత్తపల్లిలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ నెల 22న నామినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు. నాయకులు చిన్నంనాయుడు, తాతారావు, సూరినాయుడు, ముసలినాయుడు, దాలినాయుడు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని