జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి.
రూ. వేలు కుమ్మరిస్తేనే ఇంటికి ఇసుక
సామాన్యుల కష్టాలు పట్టని సీఎం
నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో కీలకమైన ఇసుక దొరక్క ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా ప్రభుత్వం అలాంటి పరిస్థితి తీసుకువచ్చింది. గతంలో తెదేపా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించి ప్రజలను ఆదుకుంటే... జగన్ సర్కారు ఆ విధానం రద్దు చేసి అష్టకష్టాల పాల్జేసింది.
ఈనాడు, విశాఖపట్నం: జగన్ పాలనలో ఇసుక బంగారం అయిపోయింది. భారీ ధరలు జనం రక్తన్నా పీల్చిపిప్పిచేస్తున్నాయి. పలువురు నేతలు ఇసుక నిల్వలను తమ గుప్పిట్లో పెట్టుకొని...చెప్పిన ధరకు కొనాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి తెచ్చారు.
- భారీ భవన సముదాయాలు, అపార్టుమెంట్లు నిర్మించే వ్యాపారులు అధిక మొత్తంలో తెప్పించుకోవడం కొంత సులువే అయినా...సామాన్యులు మాత్రం ఇసుక లభించక గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం జనం గురించి ఆలోచించదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- జిల్లా పరిధిలో స్థానికంగా రేవులు లేకపోవడం, పొరుగు జిల్లాలపై ఆధారపడడం వల్ల అవసరానికి సరిపడా అందుబాటు ధరలో లభించడం లేదు. ఇతర జిల్లాల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి లారీల ద్వారా తెచ్చే క్రమంలో జాతీయ రహదారిపై టోలు ఛార్జీలు తప్పడం లేదు. విజిలెన్స్, పోలీసు, రవాణా, గనుల శాఖలతో అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా అయ్యే మొత్తాల భారం అంతా కొనుగోలుదారులే భరించాల్సి వస్తోంది. తెదేపా హయాంలో ఏడాదికి దాదాపు రూ.126 కోట్ల ఇసుక కొంటే... అంతే పరిమాణానికి ఇప్పుడు రూ.252 కోట్లు వ్యయం చేయాల్సి వస్తోంది.
నిల్వ కేంద్రాలను ఎత్తేసిన ప్రభుత్వం..
విశాఖ జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాలను వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులతో తెప్పించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల అదనపు భారం పడుతోంది. గతంలో ముడసర్లోవ, భీమిలి, లంకెలపాలెంలో నిల్వ కేంద్రాలు ఉండేవి. ఇక్కడికి శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జిల్లాల నుంచి ఇసుక తీసుకొచ్చి నిల్వ చేసేవారు. కొద్ది రోజుల పాటు నిర్వహించి ఆ తర్వాత మూసేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇసుక లభ్యత లేదు. ప్రైవేటుగా లారీల ద్వారా రప్పించుకోవాల్సిందే. ఇది సామాన్యులకు తలకుమించిన భారమవుతోంది.
ధర ఎంతంటే..
టన్ను ఇసుక కావాలంటే రూ.1,600 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. భారీగా కొనుగోలు చేస్తే టన్నుకు రూ.1,400 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. 16 టైర్ల లారీలో 32 టన్నుల ఇసుక పడుతుంది. టన్ను రూ.1400 చొప్పున కొనుగోలు చేస్తే రూ.44,800 అవుతుంది. దీనికి టోల్ ఛార్జీలు అదనం.
అందుబాటులో ఉంటుంది: 5 వేల టన్నులకన్నా తక్కువే
- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం నుంచి టన్ను ఇసుక తెచ్చేందుకు రూ.700లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే ఇసుక రూ.1400కు చేరింది. గతంలో ఇసుకను ఉచితంగా అందించడం వల్ల కేవలం రవాణా ఖర్చులే పడేవి. ఇప్పుడు యూనిట్ ఇసుకకు ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు. తెదేపా హయాంలో 32 టన్నుల ఇసుక లారీకి రూ.22,700 ఖర్చయ్యేది. జగన్ ఏలుబడిలో రెట్టింపై రూ.44,800లకు చేరింది.
విశాఖలో ఒక రోజుకి కావాల్సిన ఇసుక: పది వేల టన్నులు (సుమారు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
[ 04-05-2024]
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM