logo

బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు.

Published : 01 May 2024 03:09 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా  అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అతని వద్ద 16 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాలుడ్ని జువైనల్‌ హోమ్‌కు తరలించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం స్టేషన్లలో ప్రత్యేక బృందాలు గస్తీని ముమ్మరం చేశాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని