బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు.
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా స్టేషన్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అతని వద్ద 16 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాలుడ్ని జువైనల్ హోమ్కు తరలించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం స్టేషన్లలో ప్రత్యేక బృందాలు గస్తీని ముమ్మరం చేశాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో చాకిరి చేయించుకుని, పారితోషికంగా చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
పేదల ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. -
గౌరవ భృతికి ఎదరుచూపులు
[ 21-05-2024]
ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) గౌరవ భృతి కోసం ఎదురుచూస్తున్నారు. -
119 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యికిపైగా ఓట్లు
[ 21-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యల్ప పోలింగ్ శాతం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నమోదైతే, అత్యధిక పోలింగ్ శాతం భీమిలి నియోజకవర్గం పరిధిలో నమోదైంది. -
బాధితులకు అండగా నిలిస్తే కేసులా.. : పల్లా
[ 21-05-2024]
ఓటమి భయంతోనే తెదేపా సానుభూతిపరులపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు -
డిసెంబరు 15న నేవీమారథాన్
[ 21-05-2024]
భారత నౌకాదళానికి చెందిన తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నం సాగరతీరంలో ఈఏడాది డిసెంబరు 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్టు సోమవారం నేవీ వర్గాలు ప్రకటించాయి. -
కూండ్రంలో 24వ అగ్ని ప్రమాదం
[ 21-05-2024]
కూండ్రం గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. -
అప్పన్న సేవకు తరలివచ్చిన దాసుడు
[ 21-05-2024]
ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన అప్పన్న భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు సోమవారం సాయంత్రం భక్త బృందంతో కలిసి సింహగిరికి తరలివచ్చారు. -
విజేతల ఊరేగింపులపై ఆంక్షలు
[ 21-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్గున్నీ వివరించారు. -
గుర్తింపు కార్డు లేకున్నా అనుమతి
[ 21-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే గుర్తింపుకార్డులు లేకున్నా కొత్త రైతులను బజార్లకు అనుమతిచ్చేలా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపటం విమర్శలకు దారితీస్తోంది. -
‘తెలంగాణ ఈసెట్’లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
కళ్లెదుటే కుమారుడి మృత్యువాత
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM