logo

నేడు పెందుర్తిలో పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 01 May 2024 03:43 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో ఆయన కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెందుర్తి కూడలిలో జరిగే పవన్‌ కల్యాణ్‌ వారాహి ప్రచార సభకు భారీఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గం భాజపా సమన్వయకర్త గొర్లె రామునాయుడు, తెదేపా, జనసేన వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, డీబీఎల్‌నాయుడు, నాయకులు వేగి దివాకర్‌, పెంటకోట రాజేంద్రప్రసాద్‌, ఆళ్ల రమేశ్‌, పీలా జితేంద్ర, శరగడం బుజ్జి, వేగి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని