సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు.
ఎన్నికల వేళ చక్రం తిప్పుతున్న నేతలు
రూ.వంద కోట్ల విలువైన భూమిపై కన్ను
సర్వే పేరుతో చెట్లు కొట్టి, యంత్రాలతో కొండవాలు చదును
కళ్లప్పగించి చూస్తున్న దేవాదాయశాఖ అధికారులు
ఈనాడు-విశాఖపట్నం, అక్కయ్యపాలెం-న్యూస్టుడే: ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పనుల వద్దకు వైకాపా నాయకులు, కార్పొరేటర్లు కొందరు వచ్చివెళుతుండటంతో ఓ కీలక నేత అండ ఉందన్న చర్చ సాగుతోంది. ఆక్రమణదారులు కన్నేసిన దాదాపు ఏడు ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100కోట్లపైమాటే.
నేతల అండతో: ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గణేశ్నగర్ పక్కన ఉన్న సత్యవతి లే-అవుట్ ఆనుకుని కొండను కొందరు చదును చేస్తున్నారు. సర్వే నెంబరు 275లోని సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ కొండవాలును రెండు భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. తవ్వి తీసిన గ్రావెల్తో దిగువన లోతట్టు ప్రాంతం చదును చేస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన రక్షణ గోడ దాటి ఈ తంతంగం అంతా జరుగుతోంది. అక్కడ ఉన్న చెట్లను పూర్తిగా నరికేశారు. వాటిని రంపాలతో ముక్కలుగా కోసి ఆటోల్లో అక్కడి నుంచి తరలించేస్తున్నారు. పునాదుల్లో వేయడానికి రాళ్లు లారీల్లో తెచ్చి సిద్ధం చేశారు.30 అడుగుల రోడ్డుకూ ప్రణాళిక వేశారు.
ఈనాం పట్టాతో కథ నడుపుతూ: విజయనగర రాజుల ద్వారా సత్యవతమ్మ అనే మహిళకు ఈనాం పట్టా ఉన్నట్లు 7.05 ఎకరాలకు ఆర్డర్ గతంలో తెచ్చుకున్నారు. ఆ భూమిని అమ్మకాలు జరపగా, నిర్మాణాలు సైతం జరిగాయి. ఈనాం పట్టా కింద ఇచ్చిన భూమితోపాటు మరికొంత ఆక్రమించి అమ్మకాలు చేశారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. దేవాదాయశాఖలో కొందరు అధికారుల సహకారంతోనే అప్పట్లో ఈ వ్యవహారం చక్కబెట్టారనే ఫిర్యాదులందడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఆదేశాలతో సర్వే చేశారు. ఈనాం ఆర్డర్ కంటే ఎక్కువ భూమి అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో ఎలాంటి పనులు, నిర్మాణాలు చేపట్టకుండా అప్పటి నుంచి అడ్డుకుంటున్నారు. మళ్లీ ప్రస్తుతం కొందరు అదే ఏడు ఎకరాలు ఈనాం పట్టా తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నట్లు సమాచారం.
సర్వే పేరుతో: ఈనాం ఆర్డర్ చూపించి గతంలో దాదాపు 5 వేల గజాలు ఓ సంస్థకు విక్రయించారు. ఆ సంస్థకు ఇవ్వడానికి అక్కడ భూమి లేదు. దీంతో హద్దులు మార్చేసి ఇంకా తమ భూమి కొండవాలులో మిగిలి ఉందని చూపించడానికి సర్వే పేరుతో భారీ ప్రణాళిక రూపొందించారు. ఆ ఐదు వేల గజాల స్థలం అందులో కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా వైకాపా కీలక నాయకుడి అండతోపాటు, కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని సర్వేకు ఆర్డర్ తెచ్చుకున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై దేవాదాయశాఖ ఏఈవో రమణమూర్తిని వివరణ కోరగా... 1994లో ఈనాంకు ఎన్వోసీ ఇచ్చామని, ఆ స్థలాలు అమ్మేసి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే హద్దుల గుర్తింపునకు సర్వే నోట్ ఇచ్చామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాలో గోల్‘మాల్’..!
[ 22-05-2024]
మండు వేసవిలో ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే అధికారులు మాత్రం ఓ భారీ మాల్కు నిత్యం లక్షల లీటర్ల నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించేశారనే విమర్శలొస్తున్నాయి. -
భారీ గోతులు.. నిత్య వెతలు!!
[ 22-05-2024]
విశాఖ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో గాజువాకలోని ఆటోనగర్ పారిశ్రామికవాడ మార్గమొకటి. ఆటోనగర్ ప్రవేశ ద్వారం వద్ద రహదారిని చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. -
తొలుత బ్యాలట్.. తర్వాత ఈవీఎం ఓట్లు..!
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13న జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా 70.02శాతం చొప్పున 14,09,118 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మానవ అక్రమ రవాణా మూలాల ఛేదనకు ప్రత్యేక బృందాలు: సీపీ
[ 22-05-2024]
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాలోని ఏజెన్సీలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద..భద్రత పరిశీలన
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. -
దువ్వాడ పూర్వ సీఐపై కేసు నమోదు
[ 22-05-2024]
దువ్వాడ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన సీఐ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. మంగళవారం దువ్వాడ ప్రస్తుత సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. -
అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి
[ 22-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబే ముఖ్యమంత్రి!
[ 22-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. -
త్వరలో రైతులకు గుర్తింపు కార్డుల జారీ
[ 22-05-2024]
జనవరి నెలలో ఎంపిక చేసిన రైతులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి యాసిన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు: కేఏ పాల్
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. -
ఉక్కు కార్మికులకు సగం వేతనాలు చెల్లింపు
[ 22-05-2024]
ఉక్కు కార్మికులకు ఏప్రిల్ నెలకు సంబంధించి సగం వేతనాలను మంగళవారం చెల్లించారు. ఆ వివరాలు... మే నెల 21 రోజులు గడిచిపోయినా వేతనాల చెల్లింపులు లేకపోవడంతోఆగ్రహించిన కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చెరువు మట్టి.. తవ్వుకుంటే అడిగేదెవరేటి?
[ 22-05-2024]
చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మట్టి అమ్మకాల ద్వారా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 22-05-2024]
జాతీయ రహదారిపై ఉద్దండపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. -
రికార్డుల్లేని వాహనాల స్వాధీనం
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..