logo

వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!

వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్‌గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్‌ విమర్శించారు.

Published : 07 May 2024 04:39 IST

అనకాపల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ను పరిచయం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు

వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్‌గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్‌ విమర్శించారు. తాళ్లపాలెం సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత విశాఖనగరంలో వైకాపా హయాంలో నేరాలు, ఘోరాలు పెరిగాయన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ముఠాలు పెరిగాయని ప్రజలు అంటున్నారంటే విశాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబుహయాంలో గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పెంచి ఉపాధి కల్పిస్తే, వైకాపా హయాంలో తనకు ఉన్న సమాచారం మేరకు గంజాయి తోటలకు అధికంగా పెంచుతున్నారన్నారు. విశాఖలో నేర సంస్కృతి పెరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయడానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకున్నాయన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు (భీమిలి)

వెలగపూడి రామకృష్ణబాబు (తూర్పు)

గణబాబు (పశ్చిమం)

రమేశ్‌బాబు (పెందుర్తి-జనసేన)

విష్ణుకుమార్‌రాజు (ఉత్తరం-భాజపా)

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని