అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు.
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పెందుర్తితో కలిపి పార్లమెంట్ నియోజకవర్గంలో 15,96,916 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 4449 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. 1828 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 1859 ప్రిసైడింగ్ అధికారులు, 1927 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 7480 మంది పోలింగ్ అధికారులు ఉన్నారన్నారు. 380 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. 85 ఏళ్లు పైబడిన వారితోపాటు దివ్యాంగులు 1000 మంది హోం ఓటింగ్కు ఫారం-12డి తీసుకోగా 880 మంది ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి 1340 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వగా 341 మంది ఓటు వేసి తిరిగి పంపించారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న 11,518 మంది పోస్టల్ బ్యాలెట్ తీసుకోగా 6వ తేదీ నాటికి 5126 మంది ఓటు వేశారన్నారు. పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులు అందరూ బూత్ ఏజెంట్లను నియమించాలన్నారు. డీఆర్వో బి.దయానిధి, నోడల్ అధికారులు, అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.
ఓటర్లకు పూర్తి స్థాయిలో సదుపాయాలు
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి నోడల్ అధికారులను ఆదేశించారు. సన్నద్ధతపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, విద్యుత్తు, తాగునీరు, ర్యాంపులు, మూడుచక్రాల కుర్చీలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలన్నారు. ఎండవేడిమి తట్టుకోవడానికి వీలుగా టెంట్లు వేయించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, అల్పాహారం, టీ, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభం నుంచి పూర్తైన వరకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదని, ఇతరుల జోక్యం ఉండకూడదని ఆదేశించారు. జిల్లాలోని 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఆర్వో బి.దయానిధి, నోడల్ అధికారులు సుబ్బలక్ష్మీ, రమామణి, మంజులవాణి, హేమంత్, రామారావు, శచీదేవి, మూర్తి, లక్ష్మీ, శిరీషారాణి, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..