రేవులో తేలిన జగన్ హామీలు..!
తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి.
బోటు ఆపరేటర్లకు అందని పరిహారం
ముందుకుసాగని నవీకరణ పనులు
వైకాపా సర్కారుపై మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం
వన్టౌన్, న్యూస్టుడే
తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. వీరికిచ్చిన హామీల్లో అధికశాతం అమలు కాలేదు. ఏడాదిగా చేపలరేవు అభివృద్ధి ఒక అడుగు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. మరో పక్క మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోవడంతో గిట్టుబాటు ధర లభించక మత్స్యకారులు నష్టపోతున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనాలు
ఖాతాలకు జమకాని పరిహారం
చేపలరేవు విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉంది. మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్కుమార్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అయినా రేవులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి తమను విస్మరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తుపాన్లు, ఇతర వైపరీత్యాలు, అగ్నిప్రమాదాల్లో 36 బోట్లు మునిగిపోవడంతోపాటు దగ్ధమయ్యాయి. బాధితులకు పరిహారం అందజేస్తామని వాసుపల్లి హామీ ఇచ్చినా అందలేదు. ఇటీవల అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోట్లకు రూ.1.36కోట్లు మంజూరైందని చెప్పారు. అయితే ఇంత వరకు బాధితుల బ్యాంకు ఖాతాలకు జమకాలేదు.
చేపలరేవులో 2019 మార్చి నుంచి అక్టోబరు వరకు బోటు ఆపరేటర్లకు ఆయిల్ రాయితీ నిధులు దాదాపు రూ.కోటి విడుదల కాలేదు. ఆయా నిధులు ప్రభుత్వం నుంచి వచ్చేలా చూస్తానని పలుమార్లు వాసుపల్లి హామీల వర్షం కురిపించారు. అయితే నిధులు ఇంత వరకు రాలేదని బాధితులు వాపోతున్నారు.
చేపలరేవులో మునిగి ఉన్న బోటు
ఆధునిక చేపలమార్కెట్ మూలకు..
చేపలరేవులో 2019లో రూ.2.78కోట్లు ఖర్చు చేసి ఆధునిక చేపలమార్కెట్ను నిర్మించారు. 100 మంది వర్తకుల అవసరాలకు తగ్గట్టుగా వసతులు కల్పించారు. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి ఏడాది క్రితం వాసుపల్లి మార్కెట్ను ప్రారంభించారు. ఇంతవరకు అది వినియోగంలోకి రాలేదు. దీంతో చేపలరేవు ఆరుబయటే విక్రయాలు సాగుతున్నాయి. పరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు సాగించేందుకు మార్కెట్ను నిర్మిస్తే దాన్ని వినియోగంలోకి తేవడంలో వాసుపల్లి నిర్లక్ష్యం వహించారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.
‘ఉపాధి’ మాటలు..నీటి మూటలు
- చేపలరేవులో ఎండు చేపలు ఆరబెట్టేందుకు అనువైన స్థలం కేటాయించాలని మత్స్యకార మహిళలు పలుమార్లు వాసుపల్లిని కోరారు. అదీ అమలు కాలేదు. కంటైనర్ టెర్మినల్ కార్పొరేషన్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే హామీ నెరవేరలేదు. ఇవే కాకుండా గత అయిదేళ్లలో మత్స్యకారులకు అవసరమైన వలలు, వేటకు ఉపయోగించే పరికరాలను అందజేయలేదు.
- చేపలరేవు నవీకరణ పనులు ఏడాది నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రహదారులు, షెడ్ల నిర్మాణ పనులే పూర్తి కాలేదు. జెట్టీల నవీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఆయా పనులు ముందుకు సాగకపోవడంపై మత్స్యకార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు